నాటిన మొక్కలు 1,780.. ఇప్పుడున్నవి 348
ఉపాధి పథకంలో భాగంగా రహదారులకు ఇరువైపులా 26 పంచాయతీల పరిధిలో 1,780 మొక్కలు నాటగా క్షేత్రస్థాయిలో 348 ఉన్నాయని సామాజిక తనిఖీ బృందాలు గుర్తించినట్లు ప్రజావేదికలో వెల్లడించారు.
సామాజిక తనిఖీల్లో గుర్తింపు
మాట్లాడుతున్న డ్వామా పీడీ చిట్టిరాజు
లావేరు, న్యూస్టుడే: ఉపాధి పథకంలో భాగంగా రహదారులకు ఇరువైపులా 26 పంచాయతీల పరిధిలో 1,780 మొక్కలు నాటగా క్షేత్రస్థాయిలో 348 ఉన్నాయని సామాజిక తనిఖీ బృందాలు గుర్తించినట్లు ప్రజావేదికలో వెల్లడించారు. లావేరులో శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2021-22లో ఉపాధి పథకం కింద వేతనదారులకు వేతనాల చెల్లింపు, పంచాయతీరాజ్ శాఖ, సామాజిక నర్సరీలు, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 748 పనులకు సంబంధించి రూ.19.73 కోట్లు ఖర్చు చేశారు. వీటిపై వారం పాటు గ్రామాల్లో డీఆర్పీలు తనిఖీలు చేపట్టారు. ఆయా వివరాలను ప్రజావేదికలో పంచాయతీల వారీగా వివరాలు వెల్లడించారు. మండలంలోని నాలుగు గ్రామ సచివాలయాలకు సంబంధించి కిటీకీలు, తలుపులు ఏర్పాటు చేయకుండా రూ.7.80 లక్షల మేర బిల్లులు చెల్లించారు. క్షేత్రస్థాయిలో కిటీకీలు, తలుపులు ఏర్పాటు చేయలేదు. బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లకు వచ్చిన సిమెంట్, ఇసుక కనిపించలేదు. దీనిపై మండల ఇంజినీరింగ్ అధికారి ఎల్.అప్పన్న మాట్లాడుతూ సిమెంట్, ఇసుక ఇతర పనులకు వినియోగించినట్లు తెలిపారు. సచివాలయాలకు త్వరలో కిటీకీలు, తలుపులు అమరుస్తామని చెప్పారు. 26 పంచాయతీల్లో వ్యయం చేసిన మొత్తంలో రూ.23,42,312 మేర వ్యత్యాసం వచ్చినట్లు గుర్తించి ప్రజావేదికలో వెల్లడించారు. దీనికి సంబంధించి రూ.45,500 రికవరీ చేయాలని ఆదేశించారు. మస్టర్లలో దిద్దుబాట్లు, బినామీ మస్టర్లు వేసి నిధులు ఉపసంహరించినట్లు కనుగొన్నారు. డ్వామా పీడీ మాట్లాడుతూ గ్రామాల్లో వారం రోజుల్లో మొక్కలు నాటాలని ఆదేశించారు. ఉపాధి విజిలెన్స్ అధికారి లవరాజు, పర్యవేక్షణాధికారి కె.వి.వి.ప్రసాద్, ఏపీడీ శైలజ, జడ్పీటీసీ సభ్యుడు సీతంనాయుడు, ఎంపీపీ ప్రతినిధి బాలకృష్ణ, ఏపీవోలు ఆర్.సత్యవతి, శ్రీనువాసులనాయుడు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప