చెరువులకు గర్భశోకం..!
టెక్కలి సమీపంలో ఉన్న 312 ఎకరాల విస్తీర్ణంలోని మినీ రిజర్వాయరు మదన గోపాలసాగరం ఆక్రమణల చెరలో చిక్కుకుంది. మూడు వైపుల నుంచి చెరువు గర్భాన్ని ఆక్రమిస్తున్నారు.
ఆక్రమణలతో బక్కచిక్కుతున్న సాగునీటి వనరులు
రావివలసలోని కుమ్మరిగుంట చెరువు గర్భంలో వెలిసిన పంట పొలాలు
* టెక్కలి సమీపంలో ఉన్న 312 ఎకరాల విస్తీర్ణంలోని మినీ రిజర్వాయరు మదన గోపాలసాగరం ఆక్రమణల చెరలో చిక్కుకుంది. మూడు వైపుల నుంచి చెరువు గర్భాన్ని ఆక్రమిస్తున్నారు. ఏడాది కిందట కొంతమంది ఇక్కడ మట్టి పోసి చదును చేస్తుండగా వంశధార శాఖ అధికారులు అడ్డుకున్నారు. అయినా కొద్ది రోజుల్లోనే పంట పొలంగా మార్చేశారు.
* టెక్కలి పట్టణానికి సమీపంలో ఉన్న తొలుసూరుపల్లి గ్రామంలో భూముల ధరలకు డిమాండ్ రావడంతో కబ్జాదారుల కన్ను ఇక్కడి చెరువులపై పడింది. గ్రామ సమీపంలో ఉన్న దుంపల, లక్ష్మీచెరువుతో పాటు గ్రామ ప్రారంభంలో ఉన్న మరొక దాన్ని కబ్జా చేసేశారు.
* రావివలస పంచాయతీ పరిధిలో ఉన్న 22 చెరువులు పూర్తిగా పూర్వ వైభవాన్ని కోల్పోయాయి. గర్భాలను ఆక్రమిస్తూ పంట పొలాలుగా మార్చేశారు. గతంలో ఓసారి తొలగింపునకు మార్కింగ్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
* వేములవాడ సమీపంలో 211 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దాలిచెరువు, పెద్దరోకళ్లపల్లి సమీపంలోని 107 ఎకరాల్లో ఉన్న భద్రాక్షి ట్యాంకు ఆక్రమణలకు గురవుతున్నాయి. సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
న్యూస్టుడే, టెక్కలి పట్టణం: టెక్కలిలో సాగునీటి చెరువులు ఆక్రమణ చెరలో చిక్కుకుని రోజురోజుకూ బక్కచిక్కుతున్నాయి. వేలాది ఎకరాలకు ప్రధాన ఆయువుగా ఉన్న చెరువులు క్రమేణా తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ఏటా చొచ్చుకొస్తున్న ఆక్రమణలతో గర్భశోకాన్ని అనుభవిస్తున్నాయి. టెక్కలి మండలంలో వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆయకట్టును మినహాయిస్తే అధికశాతం పంట పొలాలకు సాగునీటి చెరువులే ఆధారం. మండలంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 281 చెరువులు ఉండగా వీటి విస్తీర్ణం సుమారు 2,480 ఎకరాలు ఉంది. వీటికింద 25 వేల ఎకరాల పంట భూములు ఆధారపడి ఉన్నాయి. సమీప గ్రామాల ప్రజలు వ్యవసాయంతో పాటు ఇతర ప్రజావసరాలకూ వీటినే వినియోగిస్తున్నారు. ఇటు రెవెన్యూ, అటు వంశధార అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఆక్రమణలు పెచ్చుమీరుతున్నాయి.
హద్దులు మీరుతున్నారు..
పదేళ్ల కిందట ఉపాధి పథకంలో భాగంగా మండలంలోని ప్రధాన చెరువుల హద్దులను అధికారులు నిర్ణయించారు. సర్వే అధికారులు నిర్ణయించిన హద్దుల్లో ఉపాధి వేతనదారులతో ట్రెంచ్ల తవ్వకాలు జరిపి గట్లు కూడా వేశారు. అక్కడికి కొద్ది నెలల్లోనే మళ్లీ పాత పరిస్థితే ఎదురైంది. గట్లు చదును చేసిన ఆక్రమణదారులు హద్దుల్ని దాటి లోపలకు చొచ్చుకెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలోనైనా చెరువుల ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఈ చర్యల వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఆయకట్టుకు మరింత ఉపయోగంగా ఉంటుందని కోరుతున్నారు.
తొలుసూరుపల్లి వద్ద చెరువును కప్పేసి చేపట్టిన నిర్మాణాలు
రీసర్వేలో గుర్తిస్తాం... సాగునీటి వనరులైన చెరువుల ఆక్రమణలను ఉపేక్షించం. వీటిపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే పూర్తయితే స్పష్టత వస్తుంది. ఇది పూర్తయ్యాక అన్నిచోట్లా తొలగింపు చర్యలు చేపడతాం.
కిశోర్, ఇన్ఛార్జి తహసీల్దారు, టెక్కలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్పీకర్ తమ్మినేని కోటకు బీటలు!
[ 18-04-2024]
ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి సుమారు రెండు వేల కుంటుంబాలకు పైగా వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎక్కువగా చేరారు. ముఖ్యమంత్రి జగన్ పాలనా విధానాలు నచ్చకపోవడం, గ్రామ స్థాయిలో అభివృద్ధికి వీలులేకపోవడం, ఐదేళ్ల పాటు సభాపతి పట్టించుకోలేదనే అసంతృప్తి ఎక్కువ మందిలో ఉంది. -
పేదోడి ఇళ్లపై జగన్ ఉక్కుపాదం
[ 18-04-2024]
తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్న సీఎం జగన్.. ప్రకృతి విపత్తు ధాటికి ఇళ్లు కోల్పోయిన బాధితులను పట్టించుకోలేదు. నోరు తెరిస్తే పేదలకు తామే మేలు చేస్తున్నామంటూ ఊదరగొట్టే ముఖ్యమంత్రి హుద్హుద్ ఇళ్ల విషయంలో కరుణ చూపలేకపోయారు. -
పాలకుల నిర్లక్ష్యం.. యువత శ్రమదానం
[ 18-04-2024]
బూర్జ మండలం నీలాదేవిపురం కూడలి, శ్రీకాకుళం- పాలకొండ ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలను టీఆర్రాజుపేట, సంకురాడకు చెందిన యువత సిమెంటు, పిక్కరాయితో బుధవారం పూడ్చారు. -
వందకు పైగా వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరిక
[ 18-04-2024]
పార్టీ మీద, మా మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్న వందలాది మంది నమ్మకాలను వమ్ము కానివ్వమని, అభివృద్ధి అంటే ఏమిటో? చేసి చూపుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల తొలి ఘట్టానికి తెరలేస్తోంది.. నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా పరిధిలో పార్లమెంట్ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. -
గ్రేవ్ కేసుల్లో పురోగతి సాధించాలి
[ 18-04-2024]
గ్రేవ్ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి పురోగతి సాధించాలని ఎస్పీ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లాలో నమోదైన గ్రేవ్, ఎస్టీ, ఎస్టీ, పోక్సో, అత్యాచారం, హత్య కేసులపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు -
పట్టాభిరామునికి ప్రియవందనం.. అయోధ్య రామునికి అభివందనం
[ 18-04-2024]
శ్రీరామనవమి వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రజలు వైభవంగా నిర్వహించారు. -
పిడుగుపాటుకు మహిళ మృతి
[ 18-04-2024]
పిడుగుపాటుకు గురై మహిళ మృత్యువాత పడిన ఘటన గార మండలంలో బుధవారం చోటు చేసుకుంది -
ఉదయం ఎండ.. సాయంత్రం వాన
[ 18-04-2024]
జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి ఎండ వేడిమితో జనం అల్లాడిపోయారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. -
చంద్రబాబుతోనే సంక్షేమ పాలన: ఎంపీ
[ 18-04-2024]
చంద్రబాబుతోనే సంక్షేమ పాలన సాధ్యమని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలో బుధవారం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్తో కలిసి ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
జానకీనాయక.. జగమంతా వేడుక..
[ 18-04-2024]
ఊరూరా పందిళ్లు.. వాడవాడలా వేడుకలతో సిక్కోలులో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. బుధవారం జిల్లావ్యాప్తంగా శ్రీరామ నవమి సందడి నెలకొంది. రామమందిరాలు, ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM