logo

సచివాలయ కార్యదర్శిపై సహోద్యోగి దాడి

పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి పంచాయతీ కార్యదర్శి కె.మనోజ్‌కుమార్‌పై తెంబూరు పంచాయతీ కార్యదర్శి బి.రవీంద్రబాబు దాడి చేసినట్లు ఎంపీడీవో జయంత్‌ప్రసాద్‌ తెలిపారు.

Published : 05 Feb 2023 03:04 IST

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి పంచాయతీ కార్యదర్శి కె.మనోజ్‌కుమార్‌పై తెంబూరు పంచాయతీ కార్యదర్శి బి.రవీంద్రబాబు దాడి చేసినట్లు ఎంపీడీవో జయంత్‌ప్రసాద్‌ తెలిపారు. తెంబూరు సచివాలయం పరిధిలో పనిచేస్తున్న మనోజ్‌కుమార్‌ ద్విచక్ర వాహనంపై పాతపట్నం వస్తుండగా సింగుపురం కూడలి వద్ద రవీంద్రబాబు ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి దాడి చేసినట్లు చెప్పారు. తనపై దాడికి పాల్పడినట్లు శనివారం స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో మనోజ్‌కుమార్‌ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడికి గల కారణాలను తెలుసుకొని, పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈవోపీఆర్డీ నర్సింహప్రసాద్‌ పండాను విచారణ అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. దాడిపై వివరాలను నమోదు చేసుకొని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఎంపీడీవో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని