logo

‘భాజపా విజయానికి కృషి చేద్దాం’

వైకాపా, తెదేపాలు కుటుంబ పార్టీలుగానే చెలామణి అవుతున్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసేలా పనిచేయాలని ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌ కోరారు.

Updated : 06 Feb 2023 06:41 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మాధవ్‌, చిత్రంలో  బి.ఉమామహేశ్వరరావు, విశ్వనాథం తదితరులు

పలాస, న్యూస్‌టుడే: వైకాపా, తెదేపాలు కుటుంబ పార్టీలుగానే చెలామణి అవుతున్నాయని, వీటికి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసేలా పనిచేయాలని ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌ కోరారు. ఆదివారం పలాసలో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పార్టీ విజయానికి కృషి చేద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ సందర్భంగా భాజపా జిల్లా నూతన అధ్యక్షుడిగా బి.ఉమామహేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తిరుపతిరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ కె.విశ్వనాథం, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎ.రాజేశ్‌, నాయకులు పి.వైకుంఠరావు, కె.బాలకృష్ణ, సి.హెచ్‌.దుర్గారావు,  కె.పి.రామన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని