కమిటీలతోనే కాలయాపన
గ్రామాల్లో అన్నదాతలకు ఎంతో ఉపయోగపడే సహకార సంఘాలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. చివరిగా 2013 ఫిబ్రవరిలో జరిగాయి.
పీఏసీఎస్ల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే..!
జి.సిగడాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం
న్యూస్టుడే, శ్రీకాకుళం అర్బన్: గ్రామాల్లో అన్నదాతలకు ఎంతో ఉపయోగపడే సహకార సంఘాలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. చివరిగా 2013 ఫిబ్రవరిలో జరిగాయి. అయిదేళ్ల కాలపరిమితి ముగిసిన అనంతరం 2018లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. అప్పటి ప్రభుత్వం పాత పాలకవర్గాలనే కొనసాగించింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని రద్దు చేసి త్రిసభ్య కమిటీలను తెరపైకి తీసుకువచ్చింది. నేటికీ వాటినే కొనసాగిస్తోంది.
పునర్విభజన తర్వాత..: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 49 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), రణస్థలంలో ఒక రైతు సేవా సహకార సంఘం ఉండేవి. జిల్లాల పునర్విభజన తరువాత విజయనగరం జిల్లాకు 7, పార్వతీపురం మన్యానికి 6 పీఏసీఎస్లు వెళ్లిపోవడంతో ప్రస్తుతం 36 మిగిలాయి. వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తున్న త్రిసభ్య కమిటీల పదవీకాలం జనవరి 31తో ముగిసింది. వాటిని మరో ఆరు నెలలు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఏర్పాటు చేసిన కమిటీల్లో పెద్దగా మార్పులు చేర్పులు లేకుండానే పాతవారితో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
రెండు డివిజన్లలో..: శ్రీకాకుళం డివిజన్ పరిధిలో అరసవల్లి, తూలుగు, అంపోలు, ఎస్ఎంపురం, లావేరు, పైడిభీమవరం, పొందూరు, బాతువ, జి.సిగడాం, కృష్ణాపురం, కొత్తకోట, ఎల్ఎన్పేట, నరసన్నపేట, పోలాకి, కోటబొమ్మాళి, అల్లాడ, చల్లవానిపేట, బూర్జ, టెక్కలి డివిజన్ పరిధిలో కవిటి, కంచిలి, టెక్కలి, ఇచ్ఛాపురం, సంతబొమ్మాళి, నందిగాం, తెంబూరు, దిమిలాడ, పాతపట్నం, కొసమాల, మందస, బాలిగాం, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, సారవకోట, బుడితి, హిరమండలం పీఏసీఎల్లున్నాయి.
అంతా సిద్ధం చేసినా..: రెండేళ్ల కిందట సహకార సంఘాల ఎన్నికలకు కసరత్తు చేసినా ఆ ప్రక్రియ అంతలోనే ఆగింది. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన సమయంలో వీటికి కూడా ఎన్నికలు నిర్వహిస్తారని అంతా ఊహించారు. జిల్లావ్యాప్తంగా పీఏసీఎస్ల వారీగా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినా ఎన్నికలు జరగలేదు. 2019లో వైకాపా అధికారంలోనికి వచ్చిన తరువాత కమిటీలను తెరపైకి తీసుకువచ్చింది. వాటితోనే కాలయాపన చేస్తోంది.
పాలకవర్గంతోనే పరిష్కారం..: గతంలో సహకారం సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులే వాటి అధ్యక్షులను ఎన్నుకునేవారు. దీంతో వారు రైతులకు అవసరమైన సేవలందించేవారు. రుణాలు, ఇన్ఫుట్ సబ్సిడీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సకాలంలో అందేలా పాలకవర్గ సభ్యులు కృషి చేసేవారు. మూడున్నరేళ్లుగా అధికార పార్టీకి చెందిన నాయకులే పీఏసీఎస్లకు ఛైర్మన్లుగా ఉండటంతో తమ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నవారికే మరో అవకాశం..
- ఎస్.సుబ్బారావు, డీసీవో, శ్రీకాకుళం
సహకార సంఘాల త్రిసభ్య కమిటీలను ఈ ఏడాది జులై 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న కమిటీల్లోని సభ్యులకే మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. -
ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!
[ 29-03-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. -
వైకాపా కొట్టుకుపోవడం ఖాయం
[ 29-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన
[ 29-03-2024]
ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. -
ఆటలకేది ప్రోత్సాహం..?
[ 29-03-2024]
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. -
ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు..?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. -
ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. -
సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలి
[ 29-03-2024]
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. -
కూటమి విజయం.. జనసేన ఆశయం
[ 29-03-2024]
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు. -
వీడని భయం!
[ 29-03-2024]
వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్