logo

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

 రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో జరిగింది. 

Published : 06 Feb 2023 13:12 IST

ఎచ్చెర్ల, శ్రీకాకుళం :  రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. మండలంలోని  అజరాం గ్రామానికి చెందిన బురిడి పెంటయ్య(52) అనే వ్యక్తి  శ్రీకాకుళం నుంచి తన స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట వద్ద జాతీయ రహదారిపై పెంటయ్య ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని  వెనుక నుంచి వస్తున్న కారు అదుపుతప్పి  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెంటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఎచ్చెర్ల పోలీసులు వివరాలు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి  భార్య, ముగ్గురు  కుమారులు ఉన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు