నిర్లక్ష్యపు తూటా
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 తుపాకీ తూటాలను ఓ హెడ్కానిస్టేబుల్ ఆటోలో మరిచిపోయిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
ఆటోలో మరిచిపోయిన 40 తూటాలు
ఏఆర్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఎస్పీకి ఫిర్యాదు
శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్టుడే: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 తుపాకీ తూటాలను ఓ హెడ్కానిస్టేబుల్ ఆటోలో మరిచిపోయిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముద్దాయిలను కోర్టుకు తీసుకువెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి లభించడంతో వాటిని తిరిగి అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వేరే ఎవరి చేతికైనా చిక్కితే పరిస్థితి మరోలా ఉండేదని సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఏఆర్ పార్టీకి చెందిన కొందరు పోలీసు సిబ్బంది తమకు కేటాయించిన బందోబస్తు విధులను ముగించుకుని ఆదివారం తిరుగు ప్రయాణంలో ఆటోలో శ్రీకాకుళం నగరం వైపు వస్తున్నారు. ఈ క్రమంలో ఖాళీ మేగ్జైన్తో పాటు సుమారు 40 తూటాలను, పోలీసు యూనిఫాంతో కూడిన బ్యాగును ఆటోలో వదిలేసి ఆర్టీసీ కాంప్లెక్్్సలో దిగిపోయారు. అనంతరం బ్యాగును వెతుక్కుంటూ కంగారు పడ్డారు. వెంటనే పోలీస్స్టేషన్కు వెళ్లి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. రెండు గంటల అనంతరం సదరు ఆటోడ్రైవర్ బ్యాగును గుర్తించి ఆర్టీసీ స్టేషన్ మేనేజరు శామ్యూల్కు అప్పగించారు. అందులో పరిశీలించగా 40 తూటాలు బయటపడ్డాయి. అంతకముందే ఆర్టీసీ కాంప్లెక్స్ను పోలీసులు జల్లెడ పట్టడం తెలుసుకున్న ఆయన రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఒకటి, రెండో పట్టణ పోలీస్స్టేషన్ సిబ్బంది వెళ్లి వాటిని స్వాధీన పర్చుకున్నారు. దీనిపై ఏఆర్ విభాగానికి చెందిన డీఎస్పీని ‘న్యూస్టుడే’ వివరణ కోరగా తూటాలు పోయి తిరిగి దొరికాయని చెప్పారు. ఇప్పటికే ఈ ఉదంతంపై సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)