Andhra News: ఒక్కటయ్యారు.. ఒక్కటిగానే వెళ్లిపోయారు!
మంగళవాయిద్యాలు ఇంకా మదిలోనే మోగుతున్నాయి. ఏడడుగుల నడిచిన క్షణాలు కళ్లముందే కదలాడుతున్నాయి.. ఆ మూడుముళ్ల వేళ కేరింతలు వినిపిస్తూనే ఉన్నాయి..
రోడ్డు ప్రమాదంలో నవ దంపతుల దుర్మరణం
పెళ్లి దుస్తుల్లో వేణు, సుభద్ర దంపతులు
మంగళవాయిద్యాలు ఇంకా మదిలోనే మోగుతున్నాయి. ఏడడుగుల నడిచిన క్షణాలు కళ్లముందే కదలాడుతున్నాయి.. ఆ మూడుముళ్ల వేళ కేరింతలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఆత్మీయుల ఆశీర్వాదాలు, స్నేహితుల సందడి... పచ్చని పందిరి సాక్షిగా ఒక్కటైన నవ దంపతులు.. ఆ మధుర క్షణాలను దాచుకుని వైవాహిక జీవితాన్ని గడపాలని భావించారు.. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నడవాలని ఆశించారు.. కానీ.. ఆ కలలను తుంచేస్తూ, ఆ సంతోషాలను ఆవిరి చేస్తూ.. కాళ్లపారాణి ఆరకే ముందే వారి జీవన ప్రయాణానికి విధి ముగింపు పలికింది. ఇళ్లకు కట్టిన తోరణాలు వాడకముందే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఇద్దరినీ కబళించింది...
ఇచ్ఛాపురం, న్యూస్టుడే: ఇచ్ఛాపురం నుంచి అత్తవారింటికి ఒడిశా రాష్ట్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నవ దంపతులను సోమవారం సాయంత్రం ట్రాక్టరు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ మృతిచెందారు. ఈ ఘోర ఘటన ఇరు కుటుంబాలు, ఆత్మీయులందరికీ కంటతడి పెట్టించింది. ఇచ్ఛాపురంలో పట్టణంలోని బెల్లుపడ కాలనీలో ఉంటున్న గవలపు వేణు అలియాస్ సింహాచలం(26) రత్తకన్న వద్ద ఒక వస్త్రదుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతనికి బ్రహ్మపురకు చెందిన సుభద్ర అలియాస్ ప్రవల్లిక(23)తో వివాహం జరిగింది. సింహాచలం క్షేత్రంలో ఈనెల 10న జరిగిన వేడుకల్లో బంధుమిత్రులందరూ పాల్గొన్నారు. అటునుంచి వచ్చి 12వ తేదీ (ఆదివారం) ఇచ్ఛాపురంలో విందు ఏర్పాటుచేశారు. అందరూ వచ్చి నవ దంపతులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకలు ముగిశాయని, అత్తవారింటి వెళ్లేందుకు సోమవారం ఇచ్ఛాపురం నుంచి ద్విచక్ర వాహనంపై వారిద్దరూ బయలుదేరారు. గొళంత్రా పోలీస్ ఠాణా పరిధిలో ఓ ట్రాక్టర్ వీరి బండిని బలంగా ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సుభద్ర అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రగాయాలైన వేణును బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కుప్పకూలిన కుటుంబ సభ్యులు: బ్రహ్మపురలో ఎదురుచూస్తున్న వధువు కుటుంబ సభ్యులు, ఇక్కడ వేణు కుటుంబ సభ్యులకు చేదు వార్త చెవిన పడింది. దీంతో వీరంతా కుప్పకూలారు. వేణు తండ్రి రామారావు గతంలోనే చనిపోయారు. అన్నయ్య, అక్క, అమ్మతో కలసి ఉంటున్నారు. అన్యాయం చేసి వెళ్లిపోయాడంటూ బోరున విలపిస్తున్నారు. నిన్నటివరకూ ఆనందంగా గడిపిన వారికి ఇలా జరుగుతుందని ఊహించలేదని కౌన్సిలర్ ప్రదీప్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రమాదంపై గొళంత్రా (ఒడిశా) పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ