బడుల బాగుకు పీఎంశ్రీ
ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది.
కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం
పథకానికి ప్రతిపాదించిన కోడూరు ఉన్నత పాఠశాల
న్యూస్టుడే, పోలాకి: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో దీన్ని అమలు చేయనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి 2026-27 వరకు విడతల వారీగా ఎంపికైన పాఠశాలలకు నిధులు విడుదల చేయనున్నారు. ఏటా రూ.40లక్షల చొప్పున అయిదేళ్లకు ఒక్కో పాఠశాలకు రూ.2 కోట్లు అందనున్నాయి. దీనికి సంబంధించి విద్యాశాఖాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలోని 30 మండలాల్లో ప్రాథమిక, ప్రాథ]మికోన్నత, ఉన్నత పాఠశాల చొప్పున 67 పాఠశాలల జాబితాను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. తరువాత విద్యాశాఖ నుంచి ఎంపికైన పాఠశాలల్లోని పరిస్థితులు, వసతుల ఆధారంగా 60కిపైగా అంశాలతో కూడిన ప్రశ్నావళిని పాఠశాలలకు పంపారు. వీటిని అందుకున్న ప్రధానోపాధ్యాయులు తమకు అందిన ప్రశ్నావళికి బదులిస్తూ నివేదికను ఆన్లైన్లో సమర్పించారు. వీటిపై కేంద్రమే తుది జాబితా విడుదల చేస్తుందని సమగ్రశిక్ష అధికారులు తెలియజేస్తున్నారు. యూడైస్ ప్లస్, ఆన్లైన్ ప్రశ్నావళి నివేదికల ఆధారంగా పాఠశాలలు, గ్రామాలు 60, పట్టణాలు 70, మార్కులు సాధించాల్సి ఉంటుంది.
చేపట్టే కార్యక్రమాలు ఇవీ...
ఈ పథకానికి ఎంపికైతే ఆధునిక తరగతిగదులు, విద్యార్థులకు పూర్తిస్థాయిలో తాగునీరు అందుబాటులోకి వస్తాయి. ప్రయోగశాల, డిజిటల్ గ్రంథాలయం, సౌర విద్యుత్తు, అంతర్జాల సౌకర్యం, వృత్తి విద్య అమలు, క్రీడాసామగ్రి, పర్యావరణం, ఆర్ట్ స్టుడియోలు, పోషకాహార తోటను ప్లాస్టిక్రహితంగా మార్చడం నాణ్యమైన విద్య అందించడం వంటి అంశాలు ఈ పాఠశాలల్లో అమలుచేస్తారు.
జాబితా పంపించాం: జిల్లాలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమర్పించిన అన్లైన్ నివేదిక ఆధారంగా అర్హత కలిగిన పాఠశాలల జాబితాలను పంపించాం. వీటిపై కేంద్రప్రభుత్వం, విద్యాశాఖ అధికారులే ఎంపిక చేస్తున్నారు. ఏప్రిల్ మొదటివారంలో కేంద్రం తుది ఫలితాలు విడుదల చేస్తుంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు పాటించడమే మా బాధ్యత.
అనురాధ, ఏఎంవో, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా