ఉక్కుపాదం మోపితే ఉద్యమం ఉద్ధృతం
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ఉద్యమాలపై ఉక్కుపాదం మోపితే ఆగవని, మరింత ఉద్ధృతమవుతాయని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు అన్నారు.
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు వ్యాఖ్య
మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు, వేదికపై నాయకులు
పలాస, న్యూస్టుడే: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల ఉద్యమాలపై ఉక్కుపాదం మోపితే ఆగవని, మరింత ఉద్ధృతమవుతాయని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) 17వ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోగా వారిపై ఒత్తిడి పెట్టి ఇతర పనులు చేయించుకునేలా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో 30 వేల పాఠశాలలు ఉండగా.. 17 వేల పాఠశాలల్లో ఒక్కరే పాఠాలు భోదించే పరిస్థితి ఉంది. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. మరోవైపు విలీనం పేరిట మూసేస్తున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ నాటికి ఉద్యోగులు, పింఛనుదారులకు జీతాలు అందడం లేదని’ వెంకటేశ్వరరావు విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, కార్యదర్శి చౌదరి రవీంద్ర, కార్యవర్గ సభ్యులు బి.చిట్టిబాబు, ఎల్.వి.చలం, జి.కోదండరావు, కె.రమేష్, టి.అప్పారావు, ఎస్.వి.రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అధ్యక్షుడు అప్పారావు, కార్యదర్శి కిషోర్కుమార్
కార్యవర్గ ఎన్నిక: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడిగా పి.అప్పారావును ఎన్నుకున్నారు. పలాసలో ఆదివారం నిర్వహించిన 17వ కౌన్సిల్ జిల్లా సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా కె.వైకుంఠరావు, సహాయ గౌరవాధ్యక్షులుగా ఎల్.బాబూరావు, బి.ధనలక్ష్మి, అధ్యక్షుడిగా పి.అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా ఎస్.కిశెర్కుమార్, కోశాధికారిగా బి.శ్రీరామమూర్తి, 15 మందిని కార్యదర్శులుగా, తొమ్మిది మందిని రాష్ట్ర కౌన్సిలర్లుగా ప్రతిపాదించి బలపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీడిన ఉత్కంఠ..
[ 30-03-2024]
ఎచ్చెర్ల నియోజకవర్గ తెదేపాలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఇక్కడ తొలి నుంచి పొలిట్బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు, సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడు సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. -
తీరాన ప్రమాద ఘంటికలు..!
[ 30-03-2024]
పొన్నాడ పంచాయతీ పరిధి తీర ప్రాంతంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అనుమతుల్లేకుండా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక తవ్వకాలతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. -
ధాన్యం సేకరణ తక్కువే..!
[ 30-03-2024]
జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ గడువు రేపటితో ముగియనుంది.. ఖరీఫ్ కాలంలో ప్రారంభమైన వరి సాగు విస్తీర్ణం, దిగుబడులు తగ్గకున్నా కొనుగోళ్లు మాత్రం పెరగలేదు. -
జగనన్నా ఇదేం చోద్యం..!
[ 30-03-2024]
వారిద్దరూ జగనన్న కాలనీలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులుగా అధికారులు గుర్తించారు. -
కోడ్ పక్కన పెట్టి..!
[ 30-03-2024]
ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది కోడ్కు విరుద్ధంగా పార్టీల తరఫున ప్రచారాల్లో పాల్గొనవద్దని ఎన్నికల సంఘం ఆదేశించినా అవన్నీ పట్టించుకోవడం లేదు. -
రోడ్డున పడిన ఆధిపత్య పోరు..!
[ 30-03-2024]
మూలపేట గ్రీన్ఫీల్డుపోర్టు అనుసంధాన రహదారి నిర్మాణ పనుల్లో ఆధిపత్యం కోసం గుత్తేదారులు అజమాయిషీ ప్రదర్శిస్తున్నారు. -
ఊరూరా రెపరెపలాడిన తెదేపా జెండా
[ 30-03-2024]
జిల్లావ్యాప్తంగా శుక్రవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. -
7,124 మందికి ఇంటి నుంచే ఓటు!
[ 30-03-2024]
85 ఏళ్లు దాటినవారు, అర్హులైన దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ప్రజాస్వామ్య దేశంలో అయిదేళ్లకోసారి ఓటు అనే వజ్రాయుధంతో పాలకులను ఎన్నుకునే సదావకాశం లభిస్తుంది. -
అయిదేళ్లుగా వదిలేశారు..!
[ 30-03-2024]
అధికార పార్టీ నాయకుల ప్రసంగాలు, వారి హామీలు నీటి మూటలనేందుకు ఈ చిత్రాలే నిదర్శనం. -
నీటి కష్టాలు తీర్చేదెవరు?
[ 30-03-2024]
టెక్కలి జిల్లా ఆసుపత్రిలో నీటి కష్టాలు తీవ్రమవుతున్నాయి. -
తెదేపాలోకి జోరుగా చేరికలు
[ 30-03-2024]
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. -
ఆగని అక్రమాలు..
[ 30-03-2024]
పెట్టుబడి లేని వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది.