logo

బాధలు భరించలేనని.. తనువు చాలించి..!

తాళి కట్టిన భర్తే కాలయముడిగా మారి నిత్యం చిత్రహింసలు పెడుతుండగా, భరించలేని భార్య విసుగు చెంది బలవన్మరణానికి పాల్పడిన ఘటన నరసన్నపేటలో చోటుచేసుకుంది.

Published : 27 Mar 2023 05:16 IST

భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య

లక్ష్మి (పాత చిత్రం)

నరసన్నపేట, న్యూస్‌టుడే: తాళి కట్టిన భర్తే కాలయముడిగా మారి నిత్యం చిత్రహింసలు పెడుతుండగా, భరించలేని భార్య విసుగు చెంది బలవన్మరణానికి పాల్పడిన ఘటన నరసన్నపేటలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసన్నపేటలో గాంధీనగర్‌-2 వీధిలో ఉంటున్న కరుకోల లక్ష్మి(48) శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కరుకోల నారాయణమూర్తితో లక్ష్మికి 30 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు. వారు ముగ్గురూ ఉద్యోగం, చదువులరీత్యా ఇతరప్రాంతాల్లో ఉంటున్నారు. దీంతో భార్యాభర్తలు మాత్రమే అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. భార్య లక్ష్మిని నిరంతరం నారాయణమూర్తి వేధించేవాడు. అతను బయటకు వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లో ఉంచి తాళం వేసేవాడు. తరచూ భార్యను కొట్టడం, తిట్టడం, ఆహారం పెట్టకుండా వేధించేవాడు. ఈ క్రమంలో ఈనెల 25న నారాయణమూర్తి భార్య లక్ష్మిని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆమె ఇంటి ఫ్యానుకు తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మి సోదరి ఫిర్యాదు మేరకు ఎస్‌.ఐ. సింహాచలం కేసు నమోదు చేయగా, సీఐ రాము దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని