బాధలు భరించలేనని.. తనువు చాలించి..!
తాళి కట్టిన భర్తే కాలయముడిగా మారి నిత్యం చిత్రహింసలు పెడుతుండగా, భరించలేని భార్య విసుగు చెంది బలవన్మరణానికి పాల్పడిన ఘటన నరసన్నపేటలో చోటుచేసుకుంది.
భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య
లక్ష్మి (పాత చిత్రం)
నరసన్నపేట, న్యూస్టుడే: తాళి కట్టిన భర్తే కాలయముడిగా మారి నిత్యం చిత్రహింసలు పెడుతుండగా, భరించలేని భార్య విసుగు చెంది బలవన్మరణానికి పాల్పడిన ఘటన నరసన్నపేటలో చోటుచేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసన్నపేటలో గాంధీనగర్-2 వీధిలో ఉంటున్న కరుకోల లక్ష్మి(48) శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కరుకోల నారాయణమూర్తితో లక్ష్మికి 30 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు. వారు ముగ్గురూ ఉద్యోగం, చదువులరీత్యా ఇతరప్రాంతాల్లో ఉంటున్నారు. దీంతో భార్యాభర్తలు మాత్రమే అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. భార్య లక్ష్మిని నిరంతరం నారాయణమూర్తి వేధించేవాడు. అతను బయటకు వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లో ఉంచి తాళం వేసేవాడు. తరచూ భార్యను కొట్టడం, తిట్టడం, ఆహారం పెట్టకుండా వేధించేవాడు. ఈ క్రమంలో ఈనెల 25న నారాయణమూర్తి భార్య లక్ష్మిని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఆమె ఇంటి ఫ్యానుకు తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మి సోదరి ఫిర్యాదు మేరకు ఎస్.ఐ. సింహాచలం కేసు నమోదు చేయగా, సీఐ రాము దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్పీకర్ తమ్మినేని కోటకు బీటలు!
[ 18-04-2024]
ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి సుమారు రెండు వేల కుంటుంబాలకు పైగా వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎక్కువగా చేరారు. ముఖ్యమంత్రి జగన్ పాలనా విధానాలు నచ్చకపోవడం, గ్రామ స్థాయిలో అభివృద్ధికి వీలులేకపోవడం, ఐదేళ్ల పాటు సభాపతి పట్టించుకోలేదనే అసంతృప్తి ఎక్కువ మందిలో ఉంది. -
పేదోడి ఇళ్లపై జగన్ ఉక్కుపాదం
[ 18-04-2024]
తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్న సీఎం జగన్.. ప్రకృతి విపత్తు ధాటికి ఇళ్లు కోల్పోయిన బాధితులను పట్టించుకోలేదు. నోరు తెరిస్తే పేదలకు తామే మేలు చేస్తున్నామంటూ ఊదరగొట్టే ముఖ్యమంత్రి హుద్హుద్ ఇళ్ల విషయంలో కరుణ చూపలేకపోయారు. -
పాలకుల నిర్లక్ష్యం.. యువత శ్రమదానం
[ 18-04-2024]
బూర్జ మండలం నీలాదేవిపురం కూడలి, శ్రీకాకుళం- పాలకొండ ప్రధాన రహదారిలో ఏర్పడిన గుంతలను టీఆర్రాజుపేట, సంకురాడకు చెందిన యువత సిమెంటు, పిక్కరాయితో బుధవారం పూడ్చారు. -
వందకు పైగా వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరిక
[ 18-04-2024]
పార్టీ మీద, మా మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్న వందలాది మంది నమ్మకాలను వమ్ము కానివ్వమని, అభివృద్ధి అంటే ఏమిటో? చేసి చూపుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. -
నేటి నుంచి నామపత్రాల స్వీకరణ
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల తొలి ఘట్టానికి తెరలేస్తోంది.. నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లా పరిధిలో పార్లమెంట్ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. -
గ్రేవ్ కేసుల్లో పురోగతి సాధించాలి
[ 18-04-2024]
గ్రేవ్ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి పురోగతి సాధించాలని ఎస్పీ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లాలో నమోదైన గ్రేవ్, ఎస్టీ, ఎస్టీ, పోక్సో, అత్యాచారం, హత్య కేసులపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు -
పట్టాభిరామునికి ప్రియవందనం.. అయోధ్య రామునికి అభివందనం
[ 18-04-2024]
శ్రీరామనవమి వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రజలు వైభవంగా నిర్వహించారు. -
పిడుగుపాటుకు మహిళ మృతి
[ 18-04-2024]
పిడుగుపాటుకు గురై మహిళ మృత్యువాత పడిన ఘటన గార మండలంలో బుధవారం చోటు చేసుకుంది -
ఉదయం ఎండ.. సాయంత్రం వాన
[ 18-04-2024]
జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి ఎండ వేడిమితో జనం అల్లాడిపోయారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. -
చంద్రబాబుతోనే సంక్షేమ పాలన: ఎంపీ
[ 18-04-2024]
చంద్రబాబుతోనే సంక్షేమ పాలన సాధ్యమని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం గ్రామంలో బుధవారం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్తో కలిసి ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
జానకీనాయక.. జగమంతా వేడుక..
[ 18-04-2024]
ఊరూరా పందిళ్లు.. వాడవాడలా వేడుకలతో సిక్కోలులో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. బుధవారం జిల్లావ్యాప్తంగా శ్రీరామ నవమి సందడి నెలకొంది. రామమందిరాలు, ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..