నిఘా నీడలో పది పరీక్షలు
ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా విద్యాశాఖాధికారిణి జి.పగడాలమ్మ
న్యూస్టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం): ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరీక్షల సామగ్రి, ప్రశ్నపత్రాలు చేరుకున్నాయి. మాల్ప్రాక్టీస్కు తావులేకుండా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారిని జి.పగడాలమ్మ తెలిపారు. ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చొని పరీక్ష రాసే పరిస్థితి రానీయకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు. పది పరీక్షలకు సంబంధించి జిల్లాలో సన్నద్ధత గురించి ‘న్యూస్టుడే’కు ముఖాముఖిలో పలు అంశాలను వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే..
149 కేంద్రాల్లో..
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 149 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నాం. అందులో ప్రైవేటు పాఠశాలల కేంద్రాలు 56 ఉన్నాయి. మొత్తం 29,575 మంది పరీక్షలు రాయనున్నారు. వారిలో బాలురు 15,226 మంది, బాలికలు 14,349 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏ విద్యార్థికి అసౌకర్యం కలగకుండా చూడాలని ఇప్పటికే చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీచేశాం.
పక్కాగా ఏర్పాట్లు..
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశాం. ఇందుకు 70 మంది సిట్టింగ్ స్క్వాడ్లను, 8 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను వేశాం. ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా చూడాలని ఆదేశించాం. గుర్తించిన 4 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. సీసీ కెమెరాలను ఏర్పాటు అందుబాటులో ఉంచాం.
ఉదయం 8.45కే రావాలి..
విద్యార్థులు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.45 గంటల కల్లా చేరుకోవాలి. పరీక్ష 9.30 గంటల నుంచి 12.45 వరకు ఉంటుంది. ప్రశ్నపత్రాల్లో మార్పులు ఉన్నందున ఆ మేరకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. సైన్సుకు సంబంధించి భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం ఒకే పేపరుగా 100 మార్కులకు పరీక్ష రాయాలి. 12 పేజీలు చొప్పున రెండు వేర్వేరు బుక్లెట్లు, ఓఎంఆర్ షీట్లు ఇస్తాం.
అన్ని వసతులు ఉండేలా..
పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని ఇప్పటికే నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. తాగునీటి సౌకర్యాన్ని తప్పనిసరిగా కల్పించాలని, పూర్తిస్థాయిలో వెలుతురు అందేలా ఉండాలని సూచించాం. వైద్య ఆరోగ్యశాఖ సహకారంతో కేంద్రాల వద్ద మెడికల్ కిట్ అందుబాటులో ఉంచుతాం. బందోబస్తు ఏర్పాట్లను పోలీసు శాఖ చూస్తుంది.
ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దు..
పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దు. సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు వంటి పరికరాలకు అనుమతి ఉండదు. ఎవరైనా తెచ్చినా బయటే ఆపేస్తాం. విద్యార్థులకు హాల్ టిక్కెట్ల విషయంలో, పరీక్షా కేంద్రాల విషయంలో ఏమైనా సందేహాలుంటే 95056 78655 నంబరును సంప్రదించవచ్చు.
సార్వత్రిక పరీక్షలకూ సన్నద్ధం
జిల్లాలో పది, ఇంటర్మీడియట్ సార్వత్రిక పరీక్షలకు సన్నద్ధమవుతున్నాం. అవి ఏప్రిల్ 3వ తేదీ నుంచి 17 వరకు జరుగుతాయి. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. పదో తరగతికి 6, ఇంటర్కు 7 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
ఉచితంగా బస్సు ప్రయాణం
అరసవల్లి: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. కేంద్రాలకు వెళ్లి, వచ్చే సమయాల్లో పరీక్షల హాల్టిక్కెట్ను విద్యార్థులు బస్సులోని ఆర్టీసీ సిబ్బందికి చూపించి ప్రయాణించవచ్చునని ఒకటో డిపో మేనేజర్ మాధవ్ బుధవారం తెలిపారు. జిల్లాలోని అన్ని రూట్లలో ఈ సదుపాయం ఉంటుందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటల మామ.. సంక్షేమం మమ..!
[ 20-04-2024]
రాష్ట్రంలోని పిల్లలందరికీ తనకు తాను మేనమామగా ప్రకటించుకున్న సీఎం జగన్ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులను ఎంతో ఉద్ధరించినట్లు గొప్పలు చెబుతారు. -
ఉసురు తీసిన అక్రమ తవ్వకాలు
[ 20-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి గ్రామంలో ఇసుక పెళ్లలు పడి ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. -
రెండో రోజు.. ప్రధాన పార్టీల జోరు
[ 20-04-2024]
నామినేషన్ల పర్వంలో రెండో రోజు సందడిగా సాగింది. తొలిరోజు స్వతంత్ర అభ్యర్థులు బోణీ చేయగా.. శుక్రవారం ప్రధాన పార్టీల అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
నామినేషన్ల కోలాహలం
[ 20-04-2024]
ప్రధాన పార్టీల అభ్యర్థులు శుక్రవారం టెక్కలి, పాతపట్నంలో నామినేషన్లు వేశారు. పాతపట్నంలో కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు నామినేషన్ పత్రాలు దాఖలు కార్యక్రమానికి కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల
[ 20-04-2024]
బాలికలు, మహిళలు సొంత కాళ్లపై నిల్చొని ఉపాధి పొందేందుకు తగిన సహకారం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం దశాబ్దాల క్రితం శిక్షణ కేంద్రాలను జిల్లాకు ఓ చోట ఏర్పాటు చేసింది. -
పర్యాటక కేంద్రంగా భావనపాడు: అచ్చెన్న
[ 20-04-2024]
రానున్న రోజుల్లో సంతబొమ్మాళి మండలం భావనపాడును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. -
తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
[ 20-04-2024]
లావేరు మండలం పెద్దలింగాలవలస సర్పంచి ప్రతినిధి, లుకలాపు అప్పలనాయుడు, ఇతర నేతలు శుక్రవారం భాజపాలో చేరారు. -
వైకాపాకు డోల జగన్ రాజీనామా
[ 20-04-2024]
రాష్ట్రంలో గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విషయంలోనూ సఫలం కాలేకపోయిందని డీసీసీబీ మాజీ ఛైర్మన్ డోల జగన్ ఆరోపించారు. -
ద్విచక్ర వాహనం నుంచి జారిపడి మహిళ మృత్యువాత
[ 20-04-2024]
మండలంలోని పెంటూరు గ్రామానికి చెందిన కూర్మాపు సరోజినీ (48) ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. -
నిరాడంబరంగా గౌతు శిరీష నామినేషన్
[ 20-04-2024]
పలాస నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ రెండోరోజు కూటమి అభ్యర్థి గౌతు శిరీష నిరాడంబరంగా వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి మజ్జి త్రినాథ్ బాబు ర్యాలీగా వచ్చి దాఖలు చేశారు. -
పట్టణంలోనే ఉన్నా.. నిత్యం నరకమే
[ 20-04-2024]
కాలువలు ఉండవు, మట్టి రోడ్లే గతి, విద్యుత్తు దీపాలు కనిపించవు, తాగునీరు సేకరణకు అవస్థలు తప్పవు ఇదీ ఎస్టీ రిజర్వేషన్ పొందిన 4వ వార్డు దుస్థితి. వాస్తవంగా పురపాలకసంఘ బడ్జెట్లోనూ ఎస్సీ, ఎస్టీ వార్డులకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?