పలాసలో ప్రత్యేక స్పందన
పలాస పురపాలక సంఘం సమావేశ మందిరంలో బుధవారం ప్రత్యేక రెవెన్యూ స్పందన కార్యక్రమం నిర్వహించారు.
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న జేసీ నవీన్కుమార్, చిత్రంలో మంత్రి అప్పలరాజు
పలాస, న్యూస్టుడే: పలాస పురపాలక సంఘం సమావేశ మందిరంలో బుధవారం ప్రత్యేక రెవెన్యూ స్పందన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సీదిరి అప్పలరాజు, జేసీ నవీన్ వినతులు స్వీకరించారు. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలతో పాటుగా పురపాలక సంఘానికి చెందిన భూ సమస్యలు, ఆక్రమణలపై 135 ఫిర్యాదులు అందాయి. నియోజకవర్గంలో పలుచోట్ల గతంలో ఆక్రమణలు జరిగాయని మున్సిపల్ కౌన్సిలర్లు, వైకాపా నాయకులు, ఇటీవల కాలంలో భూ ఆక్రమణలు చోటు చేసుకున్నాయని తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. వినతులు ఇచ్చేందుకు వందలాది మంది రావడంతో సమావేశ మందిరం కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో ఆర్డీవో సీతారామ్మూర్తి, తహసీల్దార్లు ఎల్.మధుసూదన్, బి.పాపారావు, బి.అప్పలస్వామి, కాశీబుగ్గ సీఐ జి.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
‘నిరూపిస్తే రాజకీయాలు విరమిస్తాను’
కాశీబుగ్గ, న్యూస్టుడే: తాను ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఆక్రమించానని నిరూపిస్తే రాజకీయాలు విరమిస్తానని మంత్రి అప్పలరాజు సవాల్ విసిరారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై ఆరోపణలకు ఆధారాలుంటే రుజువు చేయాలన్నారు. తాడివాడ, బెండికొండలు తాను రాజకీయాల్లోకి రాకముందే కరిగించేశారని పేర్కొన్నారు. నల్లబొడ్లూరు కొండను ఉద్దానం ప్రాంతీయులకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం చదును చేశామని చెప్పారు. ఉండ్రుకుడియా కొండ గ్రావెల్ అనుమతులు రద్దు చేసినట్లు వివరించారు. ప్రత్యేక స్పందనలో ఎక్కువగా తెదేపా నాయకుల ఆక్రమణల గురించే ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్యప్రాణులకు ఉచ్చు..!
[ 28-03-2024]
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట గుట్టుగా సాగిపోతోంది. అప్పుడప్పుడు వేటగాళ్లు వినియోగించే నాటు తుపాకులు బయటపడుతున్న ఘటనలే నిదర్శనం. -
వైకాపాను ఓడించడమే లక్ష్యం
[ 28-03-2024]
రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
భాజపాకే ఎచ్చెర్ల
[ 28-03-2024]
ఎచ్చెర్ల నియోజకవర్గానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి తరఫున అభ్యర్థిని ఖరారు చేయడంతో రాజకీయంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. -
తెదేపాలో చేరారని కక్ష సాధింపు
[ 28-03-2024]
వైకాపా పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ గుత్తేదారు అధికార పార్టీ నుంచి తెదేపాలో చేరడంతో ఆయనపై నరసన్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడు మురళి కక్ష సాధింపు చర్యలకు దిగారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
దారి చూపు శివయ్యా..!
[ 28-03-2024]
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తిక మాసం, మహాశివరాత్రి ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. -
అనుక్షణం అదే పనిఘా
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన తరువాత నుంచి ఎక్కడికక్కడ నిఘా పెంచింది. -
గీత దాటితే వేటు తప్పదు
[ 28-03-2024]
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఆ మేరకు వారంతా ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. విజయమే లక్ష్యంగా ఓటర్లు ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. -
ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర
[ 28-03-2024]
యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు. -
ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండండి
[ 28-03-2024]
ఎన్నికల సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి.నాగార్జునరావు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM