logo

క్షయ బాధితులకు విరాళం

ప్రధానమంత్రి టీబీ ముక్త్‌భారత్‌ పథకం కింద జిల్లాలోని క్షయ బాధితులకు పోషకాహారం అందించేందుకు శ్రీకాకుళం సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంఘ జిల్లా అధ్యక్షుడు బలివాడ మల్లేశ్వరరావు రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ పి.జగన్‌మోహన్‌రావు రూ.1,05,000 విరాళం అందజేశారు.

Published : 30 Mar 2023 03:33 IST

రెడ్‌క్రాస్‌ జిల్లా ఛైర్మన్‌ జగన్‌మోహన్‌రావుకు రూ.లక్ష విరాళం అందిస్తున్న సీనియర్‌ సిటిజన్స్‌ సంఘ ప్రతినిధులు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ప్రధానమంత్రి టీబీ ముక్త్‌భారత్‌ పథకం కింద జిల్లాలోని క్షయ బాధితులకు పోషకాహారం అందించేందుకు శ్రీకాకుళం సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంఘ జిల్లా అధ్యక్షుడు బలివాడ మల్లేశ్వరరావు రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ పి.జగన్‌మోహన్‌రావు రూ.1,05,000 విరాళం అందజేశారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని రెడ్‌క్రాస్‌ కార్యాలయానికి వచ్చి సంఘ సభ్యులు ఆ మొత్తాన్ని అందించారు. అసోసియేషన్‌లోని 25 మంది సభ్యులు విరాళం మొత్తాన్ని సమకూర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని