గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ జి.ఆర్.రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు.
మాట్లాడుతున్న ఎస్పీ రాధిక
శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్టుడే: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ జి.ఆర్.రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, నేరాల నియంత్రణపై జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కేసుల్లో గతంలో అరెస్టయినవారిలో మార్పు రాకుంటే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎక్కడికక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, ఎస్బీ డీఎస్పీ ఎస్.బాలరాజు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
నిఘా పెంచండి
కలెక్టరేట్(శ్రీకాకుళం): మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల విక్రయాలపై నిఘా పెంచాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జాయింట్ యాక్షన్ ప్లాన్ అమలుపై సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల గోడలపై టోల్ ఫ్రీ నంబరు 14500ను ప్రదర్శించాలని సూచించారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు. మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మైనర్లకు మద్యం, పొగాకు, గంజాయి విక్రయించకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ జి.ఆర్.రాధిక, అదనపు ఎస్పీ విఠలేశ్వర్, ఎస్బీ డీఎస్పీ బాలరాజు, అటవీశాఖ అధికారి నిషాకుమారి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ కిశోర్, వాణిజ్యపన్నులశాఖ అధికారిణి రాణిమోహన్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.