logo

‘చలో దిల్లీ’ విజయవంతం చేయాలి

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్‌ 5వ తేదీన నిర్వహించనున్న చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు.

Published : 31 Mar 2023 06:05 IST

మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, చిత్రంలో ఇతర నాయకులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్‌ 5వ తేదీన నిర్వహించనున్న చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఈ నెల 31న, ఏప్రిల్‌ ఒకటో తేదీన ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి కె.మోహనరావు, వివిధ సంఘాల నాయకులు ఎస్‌.ప్రసాదరావు, కె.నాగమణి, పి.ప్రసాదరావు, ఎన్‌.వి.రమణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని