వన్యప్రాణులకు తాగునీటి సదుపాయం
వన్యప్రాణులు ఉన్న అంతరాబ అటవీ ప్రాంతంలో తాగునీటి సదుపాయం అధికారులు కల్పించారు. ఈనెల 28న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘వేసవి తాపం.. వన్యప్రాణులకు శాపం’ కథనానికి స్పందించారు.
న్యూస్టుడే, పాతపట్నం
తాత్కాలిక కుంటలో నీటిని నింపుతున్న అటవీశాఖ సిబ్బంది
వన్యప్రాణులు ఉన్న అంతరాబ అటవీ ప్రాంతంలో తాగునీటి సదుపాయం అధికారులు కల్పించారు. ఈనెల 28న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘వేసవి తాపం.. వన్యప్రాణులకు శాపం’ కథనానికి స్పందించారు. అంతరాబ అటవీ ప్రాంతంలో ఉన్న 15 తాత్కాలిక నీటి కుంటల్లో మోటారు సాయంతో నీటిని నింపారు. మరికొన్ని చోట్ల 20 ప్లాస్టిక్ డ్రమ్ములను ఏర్పాటు చేసి వాటిల్లో నీటిని పోస్తున్నట్లు పాతపట్నం అటవీశాఖ ప్రాంతీయ అధికారి రాజశేఖర్ తెలిపారు. ప్రతిరోజూ స్థానిక సిబ్బంది పర్యవేక్షణలో నీరు నిత్యం ఉండేలా చూస్తామన్నారు. కొండ ప్రాంతం నుంచి వచ్చే చుక్కల దుప్పిలు మైదాన ప్రాంతానికి వెళ్లకుండా నీటి కుంటల్లో నీటిని తాగుతాయన్నారు. అటవీ సరిహద్దులు దాటి వచ్చే దుప్పిలు వీధి కుక్కల బారిన పడుతున్నాయని, పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చునని రాజశేఖర్ స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ కుండీ ఏర్పాటు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!