100 రోజులు పని కల్పించలేమా?
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల పాటు పని కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.
శ్రీకాకుళం గ్రామీణ మండలం శిలగాం సింగువలసలో ఉపాధి పనులను పరిశీలిస్తున్న పీడీ చిట్టిరాజు
న్యూస్టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జాబ్కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల పాటు పని కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో గతేడాది కుటుంబానికి సగటున 60 రోజులు మాత్రమే పని చూపగలిగారు. సగటు వేతనం అందుకోవడంలోనూ జిల్లా గతేడాది కంటే వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం గరిష్ఠ వేతనం రూ.257 వరకు ఇచ్చేందుకు అనుమతిచ్చినప్పటికీ మనం కనీసం రూ.200 కూడా దాటలేకపోతున్నాం. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులోనైనా వంద రోజుల పని కల్పించగలరా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
ఉపాధి హామీ పథకం వేతనదారులకు సగటు వేతనం అంతంత మాత్రంగానే అందుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అది రూ.188.12కే పరిమితమైంది. గతేడాది ఇదే సమయానికి చూస్తే సగటు వేతనం రూ.197.25 అందుకున్నారు. అధికారులు విస్తృతంగా పర్యటనలు చేసి అవగాహన కల్పించినప్పటికీ ఫలితం కనిపించ లేదు. క్షేత్ర, సాంకేతిక సహాయకులు, ఏపీవోల మధ్య సమన్వయం లోపం కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందనే విమర్శలు వస్తున్నాయి.
క్రమంగా పడిపోతూ..
జిల్లాలో గత అయిదేళ్లలో సగటు వేతనం రూ.200 దాటింది ఒకే ఒక్క ఏడాది మాత్రమే. 2020-21లో రూ.220 వరకు వెళ్లింది. ఆ తర్వాత రోజుల్లో బాగా కిందకు పడిపోయింది. ఈ పరిస్థితి వచ్చిందనే కారణాలను కూడా అన్వేషించకపోవడంతో రెండేళ్లుగా కనీసం రూ.200 సగటు వేతనం కూడా అందుకోలేకపోతున్నాం.
సిబ్బంది సమన్వయంతో పని చేయాలి...
- జి.వి.చిట్టిరాజు, డ్వామా పీడీ, శ్రీకాకుళం
జిల్లాలో గతేడాది ఆగస్టు పదో తేదీ నాటికి సగటు వేతనం రూ.171.92గా ఉండేది. వేతనదారులకు అవగాహన కల్పించి దాన్ని రూ.188.12కు తీసుకెళ్లగలిగాం. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కొంత ఉన్నప్పటికి వేతనదారులు కూడా పనులకు వచ్చి నిర్ణీత సమయం కంటే త్వరగా వెళ్లిపోతుంటంతో ఎక్కువ రావడం లేదు. సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. విధులు సక్రమంగా నిర్వర్తించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించాం. ఈ ఏడాదిలో మెరుగైన వేతనం అందించేందుకు కృషి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)