పెద్దల భోగం... పేదలే ఫలహారం..!
పోర్టు నిర్వాసితులకు నౌపడ సమీపంలో నిర్మించే కాలనీ కోసం సేకరిస్తున్న భూమిలో అధికార పార్టీ నాయకుల ఆస్తులకు మినహాయింపు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భావనపాడు పోర్టు భూసేకరణలో సమిధలవుతున్న రైతులు
న్యూస్టుడే, టెక్కలి, సంతబొమ్మాళి
టెక్కలి గ్రామసభలో భూములు ఇవ్వబోమంటూ రైతుల నిరసన
పోర్టు నిర్వాసితులకు నౌపడ సమీపంలో నిర్మించే కాలనీ కోసం సేకరిస్తున్న భూమిలో అధికార పార్టీ నాయకుల ఆస్తులకు మినహాయింపు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబసభ్యుడికి 6 ఎకరాలు ఉండగా, దాన్ని విడిచిపెట్టి దాని పక్కనున్న పేదల భూమిని సేకరిస్తున్నారు. ఎకరాకు రూ.26 లక్షలు ఇవ్వనున్నారు. పక్కనున్న భూములు ఎకరా రూ.1.5 కోట్లకు అధికార పార్టీకి చెందిన నేతలు అమ్మకానికి పెట్టారు.
జాతీయ రహదారి నుంచి మోదుగవలస, బన్నువాడ, వేములవాడ, తలగాం మీదుగా పోర్టు అనుసంధాన రోడ్డు ఏర్పాటుకు అధికారులు ప్రకటన జారీ చేశారు. దీనిపై నిర్వహిస్తున్న గ్రామసభల పైనే విమర్శలు వస్తున్నాయి. ముందురోజు సాయంత్రం గ్రామసభను ప్రకటించి దాన్ని రద్దు చేసి ఏ సమాచారం లేకుండా తర్వాత రోజు ఉదయం టెక్కలిలో గ్రామసభ నిర్వహించారు. అయినా అక్కడికి చేరుకున్న రైతులు భూసేకరణను వ్యతిరేకించారు. సాయంత్రం బన్నువాడలో నిర్వహించిన గ్రామసభలో టెక్కలిలో రైతులు భూసేకరణకు ఒప్పుకున్నారని అధికారులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు.
భావనపాడు పోర్టు కోసం నర్సిపురం నుంచి బూరగాం మీదుగా రోడ్డు నిర్మాణానికి గతేడాది ఏప్రిల్లో భూసేకరణ ప్రకటన ఇచ్చారు. అధికార పార్టీలో ఓ నాయకుడికి చెందిన భూమి అందులో పోతుందని అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో మార్గాన్నే మార్చేశారు.
పోర్టు కోసం ప్రతిపాదించిన పాత, కొత్త రహదారుల రేఖా చిత్రం
..వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివర ఉన్నా లోటుండదన్న నానుడి పోర్టు భూసేకరణలో కనిపిస్తోంది. ముందస్తుగా అధికారుల ఆలోచనలు, ప్రణాళికలను అధికార పార్టీ నేతల ముందుంచి వారి ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ ముందుడుగు వేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూలపేట నిర్వాసిత కాలనీలకు నౌపడ కూడలిలో సేకరిస్తున్న భూమిలో నెలకొన్న తీరే స్థానిక రైతుల్ని కలచివేస్తోంది.
ఊరికో మాట.. వ్యక్తికో ఎర..!
భూసేకరణకు గ్రామసభలు నిర్వహిస్తున్న అధికారులు రైతుల్ని తప్పుదారి పట్టిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత నౌపడలో భూసేకరణకు రైతులంతా ఆమోదించారని అధికారులు చెబుతున్నారు. అయితే ధర తేల్చకుండా తామెవరం అంగీకరించబోమని రైతులు సభ నుంచి వెళ్లిపోయారు. తలగాంలో రైతులు భూసేకరణకు అంగీకరించారని అధికారులు చెబుతున్నారు. రూ.60 లక్షలు ఎకరాకు ఇవ్వకుంటే భూములిచ్చేది లేదని రైతులు సమావేశంలో తేల్చి చెప్పారు. టెక్కలి, బన్నువాడ గ్రామసభల్లో భూసేకరణను వ్యతిరేకించారు. మరోవైపు అధికారులు భూముల మార్కెట్ ధరలు నిర్ణయిస్తూ ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. భూములు కోల్పోతున్న రైతుల వివరాలు గ్రామసభల్లో తెలపకుండానే ఇదంతా నడిపిస్తున్నారు.
మారిటోరియం బోర్డు కోరిందే చేస్తున్నాం
- రాహుల్కుమార్రెడ్డి, సబ్కలెక్టర్, టెక్కలి
భావనపాడు పోర్టు కోసం చేస్తున్న భూసేకరణలో రోడ్డు సహా ఇతర ప్రతిపాదనలన్నీ మారిటోరియం బోర్డు సర్వే చేసి గుర్తించింది. అందుకనుగుణంగానే రైతులతో సంప్రదించి వారి అంగీకారం పొంది ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఇందులో ఎవరి ప్రయోజనాలు నెరవేర్చడం కోసం గాని, ఎవరి ప్రమేయంతో గాని కార్యాచరణ జరగడం లేదు. రైతులకు మా పరిధిలో ఉన్నంతవరకు న్యాయం చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు
[ 29-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చి పది రోజులు దాటినా ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వైకాపా జెండాను పోలిన రంగులతో ప్రభుత్వ వాహనాలు, భవనాలు దర్శనమిస్తున్నా వాటిపై చర్యలు లేకుండా పోయాయి. -
ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!
[ 29-03-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. -
వైకాపా కొట్టుకుపోవడం ఖాయం
[ 29-03-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. -
కాలం చెల్లిన బస్సులతోనే కాలయాపన
[ 29-03-2024]
ఆర్టీసీలో ప్రయాణం సుఖవంతం, సురక్షితం, శుభప్రదం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి బస్సుపై రాసి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా బస్సులో ప్రయాణమంటే నమ్మలేని దుస్థితి నెలకొంది. -
ఆటలకేది ప్రోత్సాహం..?
[ 29-03-2024]
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. -
ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు..?
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం అక్రమార్కుల పాలిట వరంలా మారింది. ఇదే అదనుగా భావించి కొందరు ఆమదాలవలస పట్టణంలోని విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నారు. -
ప్రచారానికి వెళ్తే... అనుమతి ఉండాల్సిందే..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ ప్రచారాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో అంతా గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. -
సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలి
[ 29-03-2024]
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. -
కూటమి విజయం.. జనసేన ఆశయం
[ 29-03-2024]
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు. -
వీడని భయం!
[ 29-03-2024]
వజ్రపుకొత్తూరు మండలం చీపరుపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో భల్లూకం భయం ఇప్పటికీ వీడ లేదు. ఇద్దరు రైతులు మృతి చెందటంతో పాటు మహిళా రైతు తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందడంతో అంతా ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు