కలుషితమవుతున్నా పట్టించుకోరా ?
శ్రీకాకుళం నగరంలోని మురుగు నీరు నాగావళి నదిలో చేరి జలాలు కలుషితమవుతున్నాయి
నాగావళి నదిలో కలిసిపోతున్న మురుగునీరు
అసంపూర్తి పనులతో దొరకని పరిష్కారం
న్యూస్టుడే, శ్రీకాకుళం నగరం
వాంబేకాలనీ వద్ద అసంపూర్తిగా నిలిచిన మురుగునీటి నిల్వ బావి పనులు
శ్రీకాకుళం నగరంలోని మురుగు నీరు నాగావళి నదిలో చేరి జలాలు కలుషితమవుతున్నాయి. అలా మురుగు నేరుగా కలవకుండా శుద్ధి చేసి ఆ నీటిని నదిలో విడిచిపెట్టాలనే లక్ష్యంతో నగరపాలక సంస్థ ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో రూ.28.14 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. 2018లో అమృత్ పథకంలో భాగంగా వాటిని ప్రారంభించారు. కొంతమేర జరిగిన తరువాత పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా పునఃప్రారంభం జరగలేదు. ఎప్పటిలాగే రోజూ లక్షలాది లీటర్ల మురుగునీరు నేరుగా కాలువల ద్వారా నదిలో కలిసిపోతోంది.
శ్రీకాకుళం నగరంలోని మిర్తిబట్టితో పాటు ఆదివారంపేట నుంచి కలెక్టరేట్ వరకు నదికి ఓ వైపున ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటి కాలువలను వాంబేకాలనీ వద్ద నిర్మించే మురుగు నీటి నిల్వ బావి(స్లంపు) వద్దకు చేర్చాలని భావించారు. అక్కడి నుంచి పైపులైను ద్వారా పొన్నాడ కొండ వద్ద నిర్మించే శుద్ధి కేంద్రానికి తరలించి.. అక్కడ మురుగునీటిని శుద్ధి చేసి అనంతరం నదిలో విడిచిపెట్టాలనుకున్నారు. దీంతో పాటు మురుగునీరు శుద్ధి చేయడం ద్వారా వచ్చిన వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేయాలనే ఉద్దేశంతో మొదటి దశ పనులు మొదలుపెట్టారు. అవి పూర్తయితే రెండో దశలో నదికి రెండో వైపున ఉన్న గుజరాతీపేట, పి.ఎన్.కాలనీ పరిసర ప్రాంతాల మురుగునీటిని గుజరాతీపేట వద్ద మరో శుద్ధి కేంద్రం నిర్మించి అక్కడికి తరలించాలని అప్పట్లో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ మొదట దశ పనులే నిలిచిపోవడంతో రెండో దశకు అతీగతీ లేని పరిస్థితి నెలకొంది.
ఎన్జీటీ హెచ్చరించినా ఇంతే..
నాగావళి జలాలు కలుషితం కాకుండా చూడాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని గతేడాది జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలకశాఖ ఉన్నతాధికారులు జిల్లా ప్రజారోగ్యశాఖ ఇంజినీరింగ్ అధికారుల నుంచి పనులను సంబంధించిన నివేదికను తీసుకున్నారు. పనులు చేస్తామని ట్రైబ్యునల్కు చెప్పి ప్రభుత్వం తప్పించుకుంది. తరువాత పనుల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు.
మురుగునీటి నుంచి మోక్షం లేదు..
నదిలో నగరానికి చెందిన తాగునీటి పథకాలు, ఎచ్చెర్ల, శ్రీకాకుళం గ్రామీణ మండలాల పరిధిలోని పలు మంచినీటి పథకాల ఊటబావులున్నాయి. నదిలో కలిసిపోతున్న మురుగునీరు వాటిల్లో చేరి కలుషితమవుతున్నాయి. వేసవిలో నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో నది మురికి కూపంగా మారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి నగరంలోని వాంబే కాలనీ వద్ద బావి(స్లంపు), పొన్నాడలో మురుగు నీటిశుద్ధి కేంద్రం ప్లాంట్ పనులు ప్రారంభించారు. అవి 25 శాతం జరిగిన తరువాత బిల్లులు చెల్లింపుల్లో జాప్యం జరగటంతో గుత్తేదారు పనులు నిలిపేశారు. తరువాత రూ.5.75 కోట్ల మేర బిల్లులు చెల్లించినా పనులు పూర్తి చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం టెండరును రద్దు చేసింది. మళ్లీ ఇంతవరకు ప్రారంభించకపోవడంతో సమస్యకు పరిష్కారం దొరకడం లేదు.
కొత్త ప్రతిపాదనలు నివేదించాం..
పనులను పూర్తి చేసేందుకు గుత్తేదారు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసింది. మళీ కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
పి.సుగుణాకరరావు, ప్రజారోగ్యశాఖ ఈఈ, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్