విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక కార్యాచరణ
పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని సమగ్ర శిక్ష అదనపు పథకం సమన్వయాధికారి ఆర్.జయప్రకాష్ పేర్కొన్నారు.
సమగ్ర శిక్ష ఏపీసీ జయప్రకాష్
న్యూస్టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)
పదో తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని సమగ్ర శిక్ష అదనపు పథకం సమన్వయాధికారి ఆర్.జయప్రకాష్ పేర్కొన్నారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా నాడు-నేడు పనులను వేగవంతం చేసేందుకు, జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీకి చేపడుతున్న చర్యలను ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో వివరించారు.
ఆన్లైన్ విధానంలోనే ప్రవేశాలు...
కేజీబీవీలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుంది. 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి కూడా దరఖాస్తులు ఆహ్వానించాం. 6వ తరగతిలో 1000కు గాను 731 సీట్ల భర్తీకి రంగం సిద్ధం చేశాం. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ముందుగానే సీటు కేటాయిస్తాం. మిగిలినవి రెండో దశలో భర్తీ చేస్తాం. మొదటి ఏడాది ఇంటర్కు సంబంధించి వెయ్యి సీట్లు అందుబాటులో ఉన్నాయి.
జాప్యం లేకుండా నాడు-నేడు పనులు
పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనుల్లో జాప్యం జరగడానికి వీల్లేదు. దీనిపై ఇప్పటికే కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ సమీక్షించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా ఎంఈవోలు చొరవ చూపాలి. ఏ స్థాయిలో అలసత్వం ప్రదర్శించినా తప్పనిసరిగా చర్యలు ఉంటాయి.
మొదటి స్థానానికి చేరేలా ప్రణాళిక..
జిల్లాలో కేజీబీవీ విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 83.25 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచారు. కొందరు పదిలో 590 మార్కులు, ఇంటర్లో 974 మార్కులు పొందారు. మరింత నాణ్యమైన విద్యను అందించి ఈసారి మొదటి స్థానానికి చేరుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారుచేస్తున్నాం. సంవత్సరం ప్రారంభం నుంచే డైలీ ఆన్లైన్ టెస్ట్(డీవోటీ) విధానం అమలుచేయాలని నిర్ణయించాం. ఆ దిశగా నిపుణుల బృందం తయారుచేసిన ప్రణాళికను పక్కాగా అమలు చేస్తాం. పర్యవేక్షణకు సెక్టోరియల్ అధికారులను నియమిస్తాం. ప్రతీ 15 రోజులకోసారి నివేదికను రప్పించుకుని పరిశీలిస్తాం.
.కేజీబీవీల్లో వసతుల సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే నాడు-నేడు ద్వారా అదనపు తరగతి గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. తాగునీరు, ఇతర సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం. విద్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. ఆ సమయంలో బోధనతో పాటు విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతులు పర్యవేక్షిస్తాం. విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు తెలుసుకుంటాం. అలసత్వం వహించిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.
మండలాలకు విద్యా కానుక కిట్లు
జగనన్న విద్యా కానుక కిట్లు పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్థులకు చేరేలా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ఇప్పటికే మండలాల వారీగా రాత పుస్తకాలు 95.61 శాతం, ఏకరూప దుస్తులు 99 శాతం చేర్చాం. అవసరమైన మేరకు బూట్లను కూడా సమకూరుస్తున్నాం.
భవిత కేంద్రాలకు పక్కా భవనాలు
జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో భవిత కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో 13 మండల వనరుల కేంద్రాల్లోనూ, 17 పాఠశాలల్లోనూ నిర్వహిస్తున్నాం. ఆయా చోట్ల మొత్తం 587 మంది విభిన్న ప్రతిభావంతులు నమోదయ్యారు. పూర్తిస్థాయి వసతులతో త్వరలోనే కొత్త భవనాలను నిర్మిస్తాం. ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి నివేదించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ