సమస్య పరిష్కరించాక అర్జీదారులకు ఫోన్ చేయాలి
స్పందనలో వినతులు ఇచ్చిన అర్జీదారులకు సమస్య పరిష్కరించిన తర్వాత దరఖాస్తుదారుడు సంతృప్తి చెందినదీ లేనిది ఫోన్ చేసి అడిగి తెలుసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ అధికారులను ఆదేశించారు
కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్
ఫిర్యాదులు పరిశీలిస్తున్న కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్, జేసీ నవీన్, శిక్షణ కలెక్టర్ రాఘవేంద్ర మీనా
కలెక్టరేట్(శ్రీకాకుళం),న్యూస్టుడే: స్పందనలో వినతులు ఇచ్చిన అర్జీదారులకు సమస్య పరిష్కరించిన తర్వాత దరఖాస్తుదారుడు సంతృప్తి చెందినదీ లేనిది ఫోన్ చేసి అడిగి తెలుసుకోవాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనకు 155 వినతులు వచ్చాయి. కలెక్టర్, జేసీ ఎం.నవీన్, శిక్షణ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును 24 గంటల్లో ఓపెన్ చేసి పరిష్కరించడమా, తిరస్కరించడమా అనే అంశాలపై వివరణ ఇవ్వాలన్నారు. తిరస్కరించినట్లయితే సరైన కారణాలను తెలియజేయాలని స్పష్టం చేశారు. స్పందన దరఖాస్తుల పరిష్కార విధానంపై ప్రతీవారం ప్రత్యేక బృందం ద్వారా ఆడిట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేటికి 21 దరఖాస్తులు రీ ఓపెన్ అయ్యాయని తెలిపారు.
జూన్ 2న మెగా జాబ్ మేళా..
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జూన్ రెండో తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ తెలిపారు. స్పందన కార్యక్రమంలో జాబ్ మేళా గోడ పత్రికను విడుదల చేసి కలెక్టర్ మాట్లాడారు. 16 స్థానిక, బహుళజాతి, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పదోతరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువత మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
39 మందికి కారుణ్య నియామకాలు..
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించినట్లు కలెక్టర్ లఠ్కర్ తెలిపారు. అర్హులైన 39 మందికి జడ్పీ సమావేశం మందిరంలో నియామక పత్రాలు అందజేశారు.
సత్వరం స్పందించాలి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్టుడే: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సత్వరం స్పందించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీ జి.ఆర్.రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ తగాదాలు 5, మోసపూరిత సమస్యలు 4, ఆస్తి తగాదాలు 11, ఇతర ఫిర్యాదులు 14, పాతవి 4 మొత్తం 38 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు ఎస్పీ టీపీ విఠలేశ్వర్, సెబ్ జేడీ వి.నాగమణికంఠ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా..’
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
సిక్కోలు గడ్డన.. జగనన్న వంచన..!
[ 24-04-2024]
మీ కష్టాలు చూశాను.. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. మన ప్రభుత్వం వస్తుంది.. సమస్యలన్నీ పరిష్కరిస్తాను.’ అన్న జగన్ మాటలు నమ్మిన జనం ఒక్క అవకాశం ఇచ్చారు. -
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..