రైలెక్కాలన్నా అవస్థలే..!
టెక్కలి రైల్వేస్టేషన్కు చేరుకోవాలంటే ఓ ప్రయాస. అక్కడినుంచి ప్రయాణం చేయాలంటే మరింత అవస్థ. రైలు కోసం వేచి చూడాలంటే కనీస మౌలిక సదుపాయాల్లేని దురావస్థ. వెరసి రైలు నిలయంలో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు.
టెక్కలి స్టేషన్పై ఎందుకీ చిన్నచూపు..!
నిలువ నీడకూ నోచుకోని వైనం
టెక్కలి రైల్వేస్టేషన్కు చేరుకోవాలంటే ఓ ప్రయాస. అక్కడినుంచి ప్రయాణం చేయాలంటే మరింత అవస్థ. రైలు కోసం వేచి చూడాలంటే కనీస మౌలిక సదుపాయాల్లేని దురావస్థ. వెరసి రైలు నిలయంలో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు.
న్యూస్టుడే, టెక్కలి,టెక్కలి పట్టణం
సౌకర్యాల కల్పన జరిగేనా ?
రైల్వేస్టేషన్లో ప్రధానంగా ప్రయాణికులు వేచి ఉండేందుకు నిలువ నీడ లేదు. ప్లాట్ఫాం ఎత్తు తక్కువ కావడంతో రైలు ఎక్కేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలకు ఇబ్బందులు తప్పలేదు. కనీసం తాగునీటి సౌకర్యం లేదు. అన్నింటికీ మించి ప్లాట్ఫాంపై విద్యుత్తు దీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో రాకపోకలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిసరాలన్నీ పనికిరాని మొక్కలు, చెత్తతో నిండిపోవడంతో స్టేషన్ నుంచి రాకపోకలు సాగించేందుకు సరైన మార్గమే లేదు. ఇలా చెప్పుకొంటూపోతే ఇక్కడ ప్రతీదీ ఓ సమస్యే.
ఎదుగూ బొదుగూ లేదు
డివిజన్ కేంద్రం టెక్కలి వల్ల నౌపడ-గుణుపూర్ మార్గం ఏర్పాటైంది. నాటి పర్లాఖెముండి రాజులు తమ ఆడపడుచును టెక్కలి రాజులకు ఇచ్చి వివాహం చేయడం, ఆమె రాకపోకల కోసం నారోగేజ్ రైలు మార్గం ఏర్పాటు చేశారు. కాలక్రమంలో అది గుణుపూర్ వరకు పొడిగించడం, పలు పోరాటాల అనంతరం బ్రాడ్గేజ్గా అభివృద్ధి చేశారు. నౌపడ నుంచి గుణుపూర్ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలు పెరుగుతున్నాయి. ఈ మార్గంలో విద్యుద్దీకరణ పూర్తి చేశారు. టెక్కలి రైల్వేస్టేషన్ అభివృద్ధిని మాత్రం అటు రైల్వే యంత్రాంగం, ఇటు పాలకులు పక్కన పెట్టేశారు. ఈ మార్గంలో నడిచే ఏకైక ఎక్స్ప్రెస్ రైలు రాజ్యరాణి టెక్కలిలో ఆగకుండా వెళ్లిపోతోంది. దీనిపై ఎన్నిసార్లు వినతులిచ్చినా ఎలాంటి స్పందన లేకుండా పోయింది.
ప్రతిపాదనలు పంపించాం...
టెక్కలి రైల్వేస్టేషన్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటికే రైల్వే శాఖకు రైల్వేస్టేషన్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించాం. త్వరితగతిన నిధులు మంజూరు చేసేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తా.
కింజరాపు రామ్మోహన్నాయుడు,పార్లమెంట్ సభ్యుడు, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.