logo

ఇచ్ఛాపురంలో సినిమా చిత్రీకరణ

స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో గురువారం సినిమా చిత్రీకరణతో సందడి నెలకొంది. ఇచ్ఛాపురానికి చెందిన అనపాన లక్ష్మీనారాయణ బాలల అంశంతో రూపొందించనున్న సినిమా తొలి సన్నివేశాన్ని ఆలయంలో చిత్రీకరించారు.

Published : 02 Jun 2023 05:57 IST

స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో గురువారం సినిమా చిత్రీకరణతో సందడి నెలకొంది. ఇచ్ఛాపురానికి చెందిన అనపాన లక్ష్మీనారాయణ బాలల అంశంతో రూపొందించనున్న సినిమా తొలి సన్నివేశాన్ని ఆలయంలో చిత్రీకరించారు. దీనికి నర్తు నరేంద్ర యాదవ్‌ దర్శకత్వం వహించగా, పట్టణ ఎస్సై కె.గోవిందరావు క్లాప్‌ కొట్టారు. పుర కమిషనర్‌ నల్లి రమేష్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. పురాధ్యక్షురాలు పిలక రాజలక్ష్మి, ఉపాధ్యక్షురాలు ఉలాల భారతిదివ్య జ్యోతి వెలిగించి పూజలు చేశారు. అనంతరం చిత్రకథను దర్శకుడు లక్ష్మీనారాయణకు అందించి శుభాకాంక్షలు తెలిపారు. చిత్రం పేరు ‘ఈ సినిమా పేరేంటి’ అని జ్ఞానభారతి విద్యాలయ సీఈవో జోహర్‌ఖాన్‌ ప్రకటించారు. కౌన్సిలర్లు బచ్చు జగన్‌, పి.మధుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని