కోట్లే.. కోట్లు
మూడు జిల్లాల్లో భారీగా పెరిగిన భూముల విలువ
ఈనాడు, విజయనగరం: ప్రభుత్వం ఆదాయం పెంపుపై దృష్టి సారించింది. భూముల క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లే ప్రధాన ఆదాయ వనరు కావడంతో వాటి మార్కెట్ విలువ పెంచింది. ఈనెల ఒకటి నుంచి అమలు చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.825.39 కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. విజయనగరం జోన్ పరిధిలో 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్న శ్రీకాకుళం జిల్లా లక్ష్యం రూ.281.47 కోట్లు, 11 కార్యాలయాలు ఉన్న విజయనగరం జిల్లా లక్ష్యం రూ.460.64 కోట్లు, నాలుగు కార్యాలయాలు ఉన్న మన్యం జిల్లా లక్ష్యం రూ.83.27 కోట్లుగా పేర్కొంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.490.38 కోట్లు కాగా, ఈసారి దాదాపు రెట్టింపుతో ఆ శాఖ యంత్రాంగానికి భారీ లక్ష్యం విధించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పది రోజుల కిందట నుంచే ఆయా జిల్లాల్లో కసరత్తు జరిగింది. అధికారులు రూపొందించిన జాబితాను ఆయా జిల్లాల సంయుక్త కలెక్టర్ల ఆమోదించిన తుది జాబితాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ప్రాతిపదిక ఏదైనా.. పెంపు ప్రధానం
* జిల్లాలో పైడిభీమవరం నుంచి ఆరు వరుసల రోడ్డు నిర్మాణం పూర్తయిన నరసన్నపేట వరకు జాతీయ రహదారికి ఇరువైపులా భూముల ధరలు పెంచారు. పైడిభీమవరంలో గజం రూ.1,300 నుంచి రూ.2 వేలకు, రూ.2,200 నుంచి రూ.3,500కు పెరిగింది. శ్రీకాకుళం వద్ద రోడ్డుకు ఇరువైపులా గజం రూ.4 వేలు నుంచి రూ.6 వేలకు, నరసన్నపేట వద్ద రూ.2,500 నుంచి రూ.3,500 వరకు పెంచారు.
* రోడ్ల పక్కన వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వ్యవసాయ భూములనూ గుర్తించారు. రెవెన్యూ అధికారుల నుంచి అందులో ఉన్న నిర్మాణాల డోర్ నంబర్ల సహా తీసుకుని విలువ పెంచేశారు.
* అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భోగాపురం మండలం అనువైనదని గుర్తించిన తర్వాత తొమ్మిదేళ్లుగా ఆ భూముల జోలికి పోలేదు. నాలుగు గ్రామాల పరిధిలో దాదాపు వంద శాతం వరకు భూముల విలువ పెంచేసింది.
* విమానాశ్రయ నిర్మాణ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు గజం రూ.1,800 ఉండగా రూ.4 వేలకు, భోగాపురం మండలంలో జాతీయ రహదారికి ఇరువైపులా గజం రూ.2,800 నుంచి రూ.4 వేలు, భోగాపురం మండల కేంద్రంలో రూ.3,200 నుంచి రూ.5 వేలు చేశారు.
కొన్ని ప్రాంతాల్లోనే...
అధికారికంగా అన్ని పత్రాలు పరిశీలించి, వాస్తవ విలువలను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ అధ్యయనంతో మాదిరి లెక్కలేసి కొన్ని ప్రాంతాల్లోనే భూముల విలువను ప్రభుత్వం పెంచింది. కొన్నేళ్ల నుంచి పెరగని భూములను ఎంపిక చేశాం.
పి.విజయలక్ష్మి, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ, విజయనగరం జోన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు