చేద్దాం రండి సైకిల్పై సవారీ...!
జిల్లా కేంద్రంలో సైకిళ్లు విక్రయించే దుకాణాలు కొన్నేళ్ల కిందట 25 నుంచి 30 వరకు ఉండేవి. ప్రస్తుతం పది కంటే తక్కువే కొనసాగుతున్నాయి.
శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సైక్లిస్టులు
అప్పుడు.. సైకిల్.. దశాబ్దంన్నర కిందట వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అన్నిరకాల పనులకు దానిపైనే ఆధారపడేవారు. రోడ్లపైన సైకిల్ సవారీలు ఎక్కువగా కనిపిస్తుండేవి. కొంతకాలం తరువాత సెలవు రోజుల్లో పిల్లలు సైకిల్ అద్దెకు తీసుకుని మరీ తొక్కి సరదా తీర్చుకునేవారు. దీని వల్ల తెలియకుండానే శారీరక, మానసిక ఆరోగ్యం పొందేవారు.
ఇప్పుడు.. సైకిల్ వినియోగం తగ్గిపోయింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం పూర్తిగా ద్విచక్రవాహనాలనే వాడుతున్నారు. ఇంధన ధరలు మండిపోతున్నా అలవాటు పడిపోవడంతో వినియోగించక తప్పడం లేదు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు మాత్రమే అరకొరగా ఉపయోగిస్తున్నారు. క్రమంగా సైకిల్ తొక్కితే కలిగే ప్రయోజనాలన్నింటికీ ప్రజలు దూరమైపోయారు. నేడు ‘ప్రపంచ సైకిల్ దినోత్సవం’ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం..
జిల్లా కేంద్రంలో సైకిళ్లు విక్రయించే దుకాణాలు కొన్నేళ్ల కిందట 25 నుంచి 30 వరకు ఉండేవి. ప్రస్తుతం పది కంటే తక్కువే కొనసాగుతున్నాయి. ఇతర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. సైకిళ్ల వినియోగం తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని శ్రీకాకుళం నగరంలోని గాంధీ సైకిల్ షాప్ యజమాని కేశవ తెలిపారు. విద్యార్థులు కొంతైనా వాడుతుండటంతో ఈ రంగంలో ఉండగలుగుతున్నామని, లేకపోతే మరో వ్యాపకం చూసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. మరోవైపు సైకిల్, స్పేర్ పార్టుల ధరలు పెరిగాయి. ఒకప్పుడు రూ.3 వేలకు మంచి సైకిల్ వచ్చేది, ప్రస్తుతం రూ.6 వేలు నుంచి రూ.12 వేలు వరకు ధరలు ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు సగటున వంద సైకిళ్లు అమ్ముడవుతుంటాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఇతర స్పేర్ పార్టులతో కలిపి నెలకు సుమారు రూ.3 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంది.
న్యూస్టుడే, పాతశ్రీకాకుళం
ఖర్చు ఆదా.. కాలుష్యం నియంత్రణ..
సైకిల్ వినియోగంతో పర్యావరణానికి ఎంతో మేలు చేయవచ్చు. దీంతో పాటు పెట్రోల్ వాడకం తగ్గి ఖర్చు ఆదాతో పాటు కాలుష్యం నియంత్రణ అవుతుంది. ఆపై ఆరోగ్య ప్రయోజనాలు ఉండనే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. రోజులో చిన్నచిన్న పనులకు సైకిల్ను వినియోగిస్తే నెలలో కనీసం ఒక లీటర్ పెట్రోల్ ఖర్చు అయినా తగ్గించవచ్చు. అంటే జిల్లా మొత్తం మీద నెలకు మూడు లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా చేయవచ్చు. అందుకే రెండు, మూడు కిలోమీటర్లు దూరంలోని కార్యాలయాలు, మార్కెట్ పనుల నిమిత్తం సైకిల్ను వినియోగిస్తే బాగుంటుంది.
ప్రయోజనాలు ఇలా..
* సైకిల్ తొక్కితే ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో అడ్రినలిన్, ఎండార్పిన్ హార్మోన్లు విడుదలై మానసిక ప్రశాంతత లభిస్తుంది.* 40 ఏళ్లు వయసు దాటిన వారికి మధుమేహం ఉంటే నియంత్రణలో ఉంచుతుంది.* గుండెకు మంచిది. తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది.* పిల్లల్లో మెదడు పనితీరు మెరుగుపడి రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.* వయస్సు మీద పడే ఛాయలు ఆలస్యంగా కనిపిస్తాయి.* బరువు తగ్గడంతో పాటు కండరాలు పటిష్టమవుతాయి.* అలసట వచ్చి హాయిగా నిద్ర పడుతుంది.
సహచరులను ప్రోత్సహిస్తున్నా.. నేను గడిచిన పదేళ్లుగా నిత్యం సైకిల్ తొక్కుతున్నాను. ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడానికి అదే కారణమని అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో స్నేహితులతో కలిసి సైక్లింగ్ క్లబ్ ఏర్పాటు చేసి సహచరులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాను.
కాపవరపు సీజు, శ్రీకాకుళం
ఎన్నో రుగ్మతలకు మంత్రం.. సైకిల్ తొక్కేవారు శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా ఉంటారు. గంట పాటు సైకిల్ తొక్కితే 780 కేలరీలు ఖర్చవుతాయి. ప్రత్యేకించి స్థూలకాయులు, వృద్ధులు, ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నవారికి సైక్లింగ్ చాలా ఉత్తమం. అనేక రుగ్మతలకు మంత్రంగా ఉపయోగపడుతుంది.
డా.అన్నెపు అశోక్కుమార్, జనరల్ ఫిజీషియన్, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
[ 25-04-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ బుధవారం ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహించిన బస్సు యాత్ర జనాలకు చుక్కలు చూపించింది. -
ఆడబిడ్డల ఆశీర్వాదంతో... అరాచక పాలన అంతం..!
[ 25-04-2024]
చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరం ఏడు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్ నగరపాలక సంస్థ మైదానంలో బుధవారం నిర్వహించిన మహిళా సభకు విశేష స్పందన లభించింది. -
థర్మల్ ఆందోళనకారులు గుర్తున్నారా జగన్?
[ 25-04-2024]
అధికార కాంక్షతో పాదయాత్ర, ఎన్నికల సభల్లో జగన్ ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని పదే పదే చెప్పేవారు. -
నామినేషన్ల దాఖలుకు నేటితో ఆఖరు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారంతో ముగియనుంది. -
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట
[ 25-04-2024]
తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
అన్న వచ్చాడుఅవస్థలు తెచ్చాడు..!
[ 25-04-2024]
టెక్కలిలో నిర్వహించిన సీఎం మేమంతా సిద్ధం సభ జన సమీకరణకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఊతమివ్వని ఉపాధి హామీ..!
[ 25-04-2024]
ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడం, గరిష్ఠ వేతనం అందేలా చూడటమే లక్ష్యంగా ఏటా డ్వామాతో పాటు మండల స్థాయి అధికారులు ఉపాధి పనులకు సంబంధించి ప్రణాళికలు తయారు చేస్తుంటారు. -
నగరంలో నామినేషన్ల సందడి
[ 25-04-2024]
శ్రీకాకుళం నగరంలో బుధవారం నామినేషన్ల సందడి కనిపించింది. తెదేపా ఎంపీ అభ్యర్థిగా కె.రామ్మోహన్నాయుడు, వైకాపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఏం చేశావని టెక్కలి వచ్చి మాట్లాడుతున్నావు
[ 25-04-2024]
‘జిల్లాలో రైతులకు కరవొస్తే ఒక్క పైసా నష్టపరిహారమైనా ఇచ్చావా.. రైతు పంట నష్టపోతే బీమా అందించావా.. నీటిపారుదల గురించి చెరువుల్లో తట్టెడు మట్టి అయినా తీశావా.. జిల్లాలో ఎక్కడైనా మీటరు సిమెంటు రోడ్డయినా వేశావా.. -
అన్ని చోట్లా.. అగచాట్లే!
[ 25-04-2024]
సంక్షేమం, అభివృద్ధికే వైకాపా తొలి ప్రాధాన్యతని పాలకులు చెబితే నిజమేనని విశ్వసించి ప్రజలు గెలిపించారు. -
ఒక్క భవనం.. ఐదేళ్లు గ్రహణం
[ 25-04-2024]
గ్రామీణ ప్రాంతాల పురోగతికి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం కీలకం. -
మామిడి కాసింది కొమ్మా లేకుండా..!
[ 25-04-2024]
మామిడి కాయలు కొమ్మలకు కాయడం సాధారణం. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుందాం
[ 25-04-2024]
రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించకుందామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర కార్యదర్శి చౌదరి పురుషోత్తంనాయుడు, -
హామీలు నెరవేర్చాలి
[ 25-04-2024]
బెంతొరియా సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఆ సంఘనాయకులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం