logo

రోడ్డు ప్రమాదంలో వస్త్ర వ్యాపారి దుర్మరణం

ఆమదాలవలస పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి అమనాన శాంతారావు(72) శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Published : 03 Jun 2023 05:07 IST

శాంతారావు (పాత చిత్రం)

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి అమనాన శాంతారావు(72) శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతారావు పట్టణంలో 40 ఏళ్లుగా వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం శాంతారావు సైకిల్‌పై రైల్వేస్టేషన్‌ కూడలి మలుపు వద్ద డివైడర్‌ పక్క నుంచి వెళ్తుండగా కొత్తూరు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఈయన సైకిల్‌కు బస్సు తగలడంతో అదుపు తప్పి వెనుక చక్రాల కింద పడిపోయారు. తలభాగం మీద నుంచి చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టానికి మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.కృష్ణ తెలిపారు.


వ్యాపారాలతో రద్దీ..

పట్టణంలోని ప్రధాన రహదారిలో హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాలు, రైల్వేస్టేషన్‌ ఉండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. దీనికితోడు తోపుడు బండ్ల్లు, ఫుట్‌పాత్‌ వ్యాపారాలు సాయంత్రం రోడ్డుపైనే నిర్వహిస్తుండటంతో బస్సులు వెళ్లేందుకు స్థలం చాలడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని