ఇక్కడ.. ఆత్మలు పనిచేస్తున్నాయట...!
సంతబొమ్మాళి మండలంలోని మర్రిపాడు గ్రామంలో ఎప్పుడో చనిపోయిన వారి ఆత్మలు వచ్చి అక్కడ ఉపాధి పనులు చేశాయట. ఐదేళ్లు, మూడేళ్లు, రెండేళ్లక్రితం చనిపోయినవారు ఇటీవల జరిగిన పనుల్లో పాల్గొన్నారట.
మర్రిపాడులో మృతిచెందిన వారికీ ఉపాధి బిల్లులు
విదేశాల్లో ఉన్నోళ్లకూ కూలి సొమ్ము చెల్లింపు
న్యూస్టుడే, సంతబొమ్మాళి
మర్రిపాడులో చేపడుతున్న ఉపాధి పనులు (పాత చిత్రం)
సంతబొమ్మాళి మండలంలోని మర్రిపాడు గ్రామంలో ఎప్పుడో చనిపోయిన వారి ఆత్మలు వచ్చి అక్కడ ఉపాధి పనులు చేశాయట. ఐదేళ్లు, మూడేళ్లు, రెండేళ్లక్రితం చనిపోయినవారు ఇటీవల జరిగిన పనుల్లో పాల్గొన్నారట. విదేశాల్లో పనులకు వెళ్లినవారు రోజూ ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నారట. ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా.... సంతబొమ్మాళి మండలంలోని మర్రిపాడు గ్రామంలో ఉపాధి పథకం కింద జరుగుతున్న పనుల్లో చోటుచేసుకున్న దారుణాలు చూస్తే ఎవరైనా అవునని అనాల్సిందే. ఇక్కడి వేతనదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఉపాధి సిబ్బంది భారీగా అక్రమాలకు పాల్పడ్డారనడానికి ఎన్నో ఉదాహరణలు.
* మర్రిపాడు పంచాయతీ చిన్నమర్రిపాడు గ్రామానికి చెందిన గిన్ని చిట్టమ్మ 2017 డిసెంబర్లో మృతి చెందింది. కానీ, 2021-22, 2022-23లో 20058 జాబుకార్డుతో ఆమె ఉపాధి పనులకు వచ్చి చెరువు పనులు చేసినట్లు చూపుతూ ఆమె బ్యాంకు ఖాతాలో రూ.వేలు నగదు జమ చేశారు.
* మర్రిపాడు గ్రామానికి చెందిన బుట్ట కాంతమ్మ 2021 నవంబర్లో మృతి చెందింది. 020208 జాబు కార్డు నంబరుతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెండు వారాలు, 2022-24 ఆర్థిక సంవత్సరాల్లో 5 రోజులు పని చేసినట్లు రికార్డులో నమోదు చేశారు.
మర్రిపాడులో ఉపాధి పథకం కింద చేపట్టిన పనుల్లో విదేశాల్లో ఉన్నవారికి బిల్లులు చెల్లిస్తున్నారు. వలస వెళ్లకుండా స్థానికంగా ఉండేవారికి, పని కావాలని చుట్టూ తిరుగుతున్న వారికి పని కల్పించాల్సిన అధికారులు విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారి పేరిట ఉపాధి కల్పించినట్లు చూపి రూ.లక్షల్లో అక్రమాలకు తెర లేపారు.
పనికి వెళ్లని వారి ఖాతాల్లో జమ
గ్రామంలో 856 జాబ్కార్డులు ఉన్నాయి. 2020-21లో రూ.75.45 లక్షలు, 2021-22లో రూ.65.22, 2022-23లో 71.25 లక్షలు వేతనాల రూపంలో చెల్లించారు. మర్రిపాడు, చిన్నమర్రిపాడు, శెలగపేట గ్రామాల వెలుపల ఉన్నవారి పేరిట మస్తర్లు నమోదు అవుతున్నాయి. పనికి వెళ్లని వారికి కొంత సొమ్ము ఇచ్చి మిగిలిన మొత్తాన్ని క్షేత్ర సహాయకుడు తీసుకుంటున్నారని వేతనదారులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలు బయటపడినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
* చిన్నమర్రిపాడు గ్రామానికి చెందిన జనపాన ధనం నాలుగేళ్లుగా ఉపాధి పనులు చేస్తోంది. అయినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఆమె బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ఆమెకు పడాల్సిన నగదు అదే గ్రామానికి చెందిన ఉపాధి పనులకు వెళ్లని ఓ మహిళ ఖాతాలో జమవుతున్నాయి. దీనిపై పలుమార్లు బాధితురాలు క్షేత్ర సహాయకుడిని ప్రశ్నించినా సాంకేతిక సమస్యని తప్పించుకున్నారే తప్ప, పరిష్కరించలేదు. 1902 నంబరుకు కాల్ చేసి గ్రామంలో ఉపాధిపనుల్లో జరిగిన అక్రమాలు వివరించారు.
విచారణకు ఆదేశించాం
మర్రిపాడు పంచాయతీలో జరిగిన ఉపాధి పనుల్లో మృతి చెందిన వేతనదారులకు మస్తర్లు వేసినట్లు నా దృష్టికి వచ్చింది. టెక్కలి డ్వామా ఏపీడీ మురళీకృష్ణను విచారణ చేయమని ఆదేశించాం. తప్పు తేలితే క్షేత్ర సహాయకులపై చర్యలు ఉంటాయి.
చిట్టిరాజు, డ్వామా పీడీ, శ్రీకాకుళం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా
[ 24-04-2024]
రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. -
23 మంది అభ్యర్థులు.. 29 నామినేషన్లు..!
[ 24-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరో రెండు రోజుల మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించేందుకు ముందుకు వస్తున్నారు. -
పోటెత్తిన పాతపట్నం.. అదరగొట్టిన అమదాలవలస..!
[ 24-04-2024]
ప్రజాగళం సభలతో పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. రెండు చోట్ల దారులన్నీ పసుపుమయంగా మారాయి. -
జగన్ సభకు జనాలను తరలించేందుకు ఏర్పాట్లు
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బుధవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ముగింపు పలకనున్నారు. -
నువ్వెక్కడున్నావో చెప్పు.. అక్కడికే వచ్చి కొడతా
[ 24-04-2024]
జిల్లాలో వైకాపా ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి గొర్లె కిరణ్కుమార్ నామినేషన్కు ఆటో పెట్టలేదని డ్రైవర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. -
ట్రాక్టరును ఢీకొన్న వ్యాను ఆరుగురికి తీవ్ర గాయాలు
[ 24-04-2024]
లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
[ 24-04-2024]
ముఖ్యమంత్రి జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా పైడిభీమవరం వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం కాదా..?
[ 24-04-2024]
గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామానికి చెందిన రేషన్ డీలరు రుప్ప శ్రీనివాసరావు మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రా -
అనుసంధానానికి జగనన్న గ్రహణం..!
[ 24-04-2024]
నాగావళి- వంశధార అనుసంధానం పనులను అయిదేళ్లుగా వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. -
అయ్యో.. అన్నదాత నమ్మి మోసపోయావా..!
[ 24-04-2024]
పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్నా వైకాపా ప్రభుత్వం అన్నదాతల నడ్డివిరిచింది. మహేంద్రతనయ, బాహుదా నదులపై నిర్మించిన ప్రాజెక్టులతో పాటు ఇతర చిన్ననీటి వనరులు రూపురేఖలు మారిపోతున్న తరుణంలోనే చక్కదిద్దాల్సిన జగన్ సర్కార్ విస్మరించడంతో సాగుభూమి -
నేడు 13 మండలాల్లో తీవ్ర వడగాలులు
[ 24-04-2024]
జిల్లాలోని 13 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.