జిల్లాలో ప్రీ ఆడిట్ విధానం అమలు
ప్రీఆడిట్ విధానంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగాన్ని నివారించొచ్చని రాష్ట్ర ఆడిట్ శాఖ డైరెక్టర్ ఆర్.హరిప్రకాశ్రెడ్డి అన్నారు.
మాట్లాడుతున్న రాష్ట్ర డైరెక్టర్ హరిప్రకాశ్ రెడ్డి
ఆమదాలవలస పట్టణం, న్యూస్టుడే: ప్రీఆడిట్ విధానంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగాన్ని నివారించొచ్చని రాష్ట్ర ఆడిట్ శాఖ డైరెక్టర్ ఆర్.హరిప్రకాశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో పురపాలక, ఆర్థిక శాఖ అధికారుల సమన్వయంతో ప్రీఆడిట్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పోస్టుఆడిట్ విధానంలో ఇబ్బందులు ఉన్నాయని, వీటిని అధిగమించేందుకు ముందస్తు పరిశీలన ఉపయోగపడుతుందన్నారు. సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్లో ఈ విధానాన్ని పురపాలికల్లో అమలుచేస్తున్నట్లు చెప్పారు. త్వరలో జిల్లా ఆడిట్, పుర అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విశాఖపట్నం ఆర్డీడీ సీతారామారావు, ఏడీ రమణ, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస పురపాలక కమిషనర్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
BJP: ఏపీలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతాం: పురంధేశ్వరి
-
Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్పై సాయిపల్లవి ట్వీట్
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్ను కోరిన అజిత్ మద్దతుదారులు