సూర్యదేవా.. పుణ్యస్నానం చేయలేమా?
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లికి సుదూరప్రాంతాల నుంచి నిత్యం భక్తులు వస్తుంటారు. సూర్యదేవుడి సన్నిధిలోని ఇంద్ర పుష్కరిణిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని విశ్వాసం.
నిధులు ఉన్నా ప్రారంభం కాని పుష్కరిణి పనులు
మూడు నెలలుగా భక్తులకు తప్పని ఇబ్బందులు
న్యూస్టుడే, శ్రీకాకుళం నగరం
నీరు లేక ఖాళీగా ఉన్న ఇంద్ర పుష్కరిణి
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లికి సుదూరప్రాంతాల నుంచి నిత్యం భక్తులు వస్తుంటారు. సూర్యదేవుడి సన్నిధిలోని ఇంద్ర పుష్కరిణిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని విశ్వాసం. ఇంతటి ప్రాధాన్యమున్న పుష్కరిణి ఆధునికీకరణ పనుల పేరుతో అధికారులు మూడు నెలల క్రితం అందులోని నీటిని ఆఘమేఘాలపై ఇంజిన్ల సాయంతో తోడేశారు. ఇంతవరకు ఏ పనులు చేపట్టలేదు. దీంతో రద్దీ సమయాల్లో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఆదిత్యాలయానికి ప్రతి రోజు 3-4 వేల మంది, ఆదివారాల్లో 10 వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 30 నుంచి 40 వేల మంది భక్తులు వస్తుంటారు. మాఘమాసం, రథసప్తమి వంటి ప్రత్యేక రోజుల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. జిల్లాతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి వేలాదిగా తరలివస్తారు. వారిలో ఎక్కువ మంది స్వామికి తలనీలాలు సమర్పించడం, పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడం, స్నానాలు చేయనివారు అందులో కాళ్లు, చేతులు, ముఖం శుభ్రం చేసుకొని ఆ నీటిని తలపై చల్లుకుంటారు. మహిళలు పసుపు, కుంకుమ పుష్కరిణిలో వేసి దీపాలు వెలిగిస్తారు. ఇప్పుడు ఆ నీటిని తోడేయడంతో పుష్కరిణి వెలవెలబోతోంది. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో తాత్కాలికంగా కుళాయిలు ఏర్పాటుచేశారు. వాటినుంచి వస్తున్న అరకొర నీటితోనే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది.
నిర్వహణ లోపంతో శిథిలావస్థకు..
ఆలయాధికారులు పుష్కరిణి నిర్వహణను విస్మరించడంతో అందులో వ్యర్థాలు, పూడిక నిండిపోయాయి. చుట్టూ ఏర్పాటుచేసిన మెంట్ రక్షణ గోడలు కూలిపోయాయి. మెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో పుష్కరిణి వెనకభాగాన ఏర్పాటుచేసిన సిమెంటు మదుము నుంచి పంట కాలువ ద్వారా పుష్కరిణిలోకి నీరు రావటం, మరో మదుము ద్వారా నీరు కాలువలోకి వెళ్లిపోయేది. ఆ మదుముల నిర్వహణను విస్మరించడంతో పాటు, పంట కాలువ చుట్టూ ఇళ్లు వెలియడంతో మురుగు కాలువగా మారిపోయింది. క్లోరినేషన్ చేయక నీరు రంగు మారి భక్తులు స్నానాలు చేసేందుకు వీల్లేకుండా పోయింది.
కొరవడిన అధికారుల సమన్వయం
ఇంద్ర పుష్కరిణి పనుల విషయంలో మొదటి నుంచి ఆలయ సిబ్బంది, సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల మధ్య సమన్వయం కొరవడి ఖర్చు విషయంలో స్పష్టత రాలేదు. వాస్తవానికి ఏదైనా పని చేపట్టే ముందు అక్కడి పరిస్థితులను పరిశీలించి అంచనాను రూపొందించాలి. ఆమేరకు సంబంధిత శాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని పనులు చేపట్టాలి. అప్పుడు అవి సకాలంలో జరిగి లక్ష్యం నెరవేరుతుంది. కానీ ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి విషయంలో అలా జరగకపోవడంతో జాప్యం జరుగుతోంది. పుష్కరిణి చుట్టూ కాంక్రీటు గోడ, అడుగుభాగాన 80 శాతం గచ్చు, మెట్లు, బారీకేడ్ల నిర్మాణం, భక్తులు స్నానాలు చేసేందుకు అనువుగా తీర్చిదిద్దాలని ఏడాది క్రితమే అధికారులు నిర్ణయించారు. ఆ పనులకు రూ.2 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. అయితే ఆ నిధులు సరిపోవని భావించి దేవస్థానం నిధులు అదనంగా మరో రూ.2 కోట్లు కేటాయించి మొత్తం రూ.4 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు పాలకమండలి, దేవాదాయశాఖ అనుమతులు తీసుకొని టెండర్లు పిలిచారు. అది ఖరారు కాగానే పుష్కరిణిలో నీరు బయటకు తోడేసి ఖాళీ చేశారు. తీరా పనులు చేపట్టేందుకు గుత్తేదారు సిద్ధపడేసరికి గతంలో రూపొందించిన ప్రతిపాదనలు సరిగా లేవనే అంశం తెరపైకి వచ్చింది.
ఇవన్నీ జరిగేదెప్పుడో?
పుష్కరిణి పనులకు సంబంధించి మళ్లీ కొత్త ప్రతిపాదనలు తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదించిన తరువాత పనులు చేపట్టాలని నిర్ణయించారు. కానీ ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. కొత్త ప్రతిపాదనలు ఎప్పుడు రూపుదిద్దుతాయో, వాటికి ఆమోదం ఎప్పుడు లభిస్తుందో, పనులు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కానుంది. ఆ సమయంలో పనులు చేపట్టినా ఉపయోగం లేదు. కార్తికమాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున వైభవంగా ఏడాదికోసారి నిర్వహించే తెప్పోత్సవం నాటికైనా ఆధునికీకరణకు నోచుకుంటుందో, లేదో చూడాలి.
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
ఇంద్ర పుష్కరిణి పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తయింది. గతంలో తయారుచేసిన ప్రతిపాదనలను రద్దు చేశాం. వాటి స్థానంలో కొత్తవి సిద్ధం చేస్తున్నాం. అవి పూర్తయిన తరువాత ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వారి అనుమతి లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
వి.హరిసూర్యప్రకాష్,ఆలయ ఈవో, అరసవిల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఠమెక్కారు.. పేదల పొట్టకొట్టారు..!
[ 19-04-2024]
వైకాపా అన్న క్యాంటీన్లను మూసివేయడంతో పేదలు ఇబ్బందులు పడుతుండేవారు. వాటిని గుర్తించి జిల్లాలో పలువురు తెదేపా నేతలు స్వచ్ఛందంగా వారి ఆకలి తీరుస్తున్నారు -
స్వతంత్ర అభ్యర్థులతో బోణీ..
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంతో పాటు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీచేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది -
‘మేమంతా సిద్ధం’ సభకు 80 ఆర్టీసీ బస్సులు
[ 19-04-2024]
వైకాపా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభలకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నారు. శుక్రవారం కాకినాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించనున్న బహిరంగ సభకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి 40, రెండో డిపో నుంచి 40 బస్సులను గురువారం రాత్రి పిఠాపురానికి పంపారు. -
రాజకీయం మారుతోంది..!
[ 19-04-2024]
జిల్లాలో రాజకీయం రోజురోజుకూ మారుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ మొదలైయింది -
‘సన్న’గిల్లుతున్న ఆశలు..!
[ 19-04-2024]
ఖరీఫ్లో ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడిన అన్నదాతలు.. ఇప్పుడు రబీలో సరైన ధర లేక సన్నరకాలను పండించినవారంతా తీవ్ర నష్టానికి గురవుతున్నారు. ఎండ తీవ్రత, సాగునీటి కొరత వంటి సమస్యలను అధిగమించి జిల్లాలో చాలా మంది సన్నధాన్యం పండించారు. -
పొంచి ఉన్న ముప్పు..పాలకులకు కలగని కనువిప్పు
[ 19-04-2024]
ప్రజా సంక్షేమం కోసం పాలకులు పాటు పడాలి. వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇవేవీ కనిపించ లేదు. -
అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం: ఎంపీ
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. -
వైభవంగా శ్రీరామ నవమి మహోత్సవాలు
[ 19-04-2024]
జిల్లాలోని పలు దేవాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు కొనసాగుతున్నాయి. గురువారం సీతారాములకు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాభిషేకాలు నిర్వహించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 19-04-2024]
బూర్జ మండలం కొల్లివలసకు చెందిన బూరవెల్లి రమణ(40) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. -
మట్టినీ వదలం
[ 19-04-2024]
కవిటి మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా సాగిస్తున్న తవ్వకాలపై అధికారులు చర్యలకు ఉపక్రమించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు -
ఐదేళ్లయినా దారికి రాని విస్తరణ..!
[ 19-04-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 నవంబరు 23న నరసన్నపేట పర్యటనలో ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు స్పందన లేకపోవడం గమనార్హం. -
శివారు.. పట్టించుకోలేదు జగన్ సారు..!
[ 19-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో విధ్వంసం తప్ప.. అభివృద్ధి లేదు. గ్రామ వికాసంలో వైఫల్యం చెందిన జగన్ సర్కార్ పట్టణాలను ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాలను పూర్తిగా విస్మరించింది.