మేము సైతం.. చంద్రన్న కోసం
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ను నిరసిస్తూ తెలుగు తమ్ముళ్ల నిరసనలు హోరెత్తుతున్నాయి.
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్ను నిరసిస్తూ తెలుగు తమ్ముళ్ల నిరసనలు హోరెత్తుతున్నాయి. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో శనివారం ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ నాయకుడికి అండగా మేము సైతం అంటూ కదం తొక్కారు.
చంద్రబాబుకు అండగా నిలవాలి..
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా కాశీబుగ్గలో రైతుల ఆధ్వర్యంలో 11వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రూ.200 ఉన్న పింఛన్ను రూ.2 వేలకు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కుట్రపూరిత చర్యలను ప్రజలంతా వ్యతిరేకించాలని కోరారు. ‘బాబుతో నేను’ సంతకాల సేకరణ బోర్డుపై మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ సంతకం చేశారు.
న్యూస్టుడే, పలాస
తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలి..
చంద్రబాబుకు న్యాయం జరగాలని కోరుతూ ఇచ్ఛాపురం ఆర్టీసీ బస్టాండు వద్ద తెదేపా శ్రేణులు చేపడుతున్న ధర్మదీక్షలు 11వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడారు. విదేశాల్లో సైతం చంద్రబాబుకు మద్దతుగా పోరాటాలు జరుగుతున్నాయని.. అధికార పార్టీ నాయకులకు మాత్రం కనిపించడం లేదని మండిపడ్డారు. తమ నాయకుడిపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని నినదించారు.
న్యూస్టుడే, ఇచ్ఛాపురం
ముమ్మాటికీ అక్రమ అరెస్టు..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టును నిరసిస్తూ మందస మండలం హరిపురంలో బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నియంత పాలన గురించి వివరించారు. చంద్రబాబుది ముమ్మాటికీ అక్రమ అరెస్టు అంటూ ధ్వజమెత్తారు. తెదేపా మండలాధ్యక్షుడు బి.దుర్యోధనరావు ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
న్యూస్టుడే, మందస
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దండిగా ఆదాయం..అద్దె గదుల్లోనే ఆవాసం..!
[ 30-11-2023]
ప్రభుత్వ శాఖలన్నింటిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్శాఖ నుంచే ఖజానాకు అధిక శాతం ఆదాయం వెళ్తుంది. కానీ ఆ శాఖ ద్వారా సేవలు పొందే క్రయవిక్రయదారులు, సేవలందించే ఉద్యోగులకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. -
సారథి.. ఏదీ కలల వారథి...?
[ 30-11-2023]
వంతెనలు.. ఆ ప్రాంత ప్రజల కలల వారధులు.. ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు తీర్చే సేతువులు.. బయట ప్రపంచంతో బంధాలను పెనవేసే బాటలు.. వీటి కోసం అక్కడి ప్రజలు అడగని నాయకుడు లేడు -
ఏం జరిగింది?
[ 30-11-2023]
మరోవైపు వివాదం బయటకొచ్చిన రోజునే డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర చికిత్స చేయిస్తూ వచ్చారు. -
సాఫ్ట్గా దూసుకెళ్లారు..!
[ 30-11-2023]
విద్యార్థుల దృక్పథం మారుతోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో అటు చదువుతో పాటు ఇటు క్రీడల్లోనూ రాణిస్తూ భవితకు బాటలు వేసుకొంటున్నారు. -
పేరుకే మహిళా ప్రాతినిధ్యం..!
[ 30-11-2023]
కోటబొమ్మాళి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రోణంకి ఉమ అధ్యక్షతన బుధవారం జరిగింది. -
కేసుల దర్యాప్తు పారదర్శకంగా జరగాలి: ఎస్పీ
[ 30-11-2023]
పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పారదర్శకంగా దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ రాధిక అధికారులను ఆదేశించారు. -
సమస్యలు వినేదెవరు... పరిష్కరించేదెప్పుడు..!
[ 30-11-2023]
గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడేందుకు ప్రత్యేకంగా పాలనా యంత్రాంగంతో పాటు సమస్యలు పరిష్కరించేందుకు మూడు నెలలకోసారి పాలకవర్గ సమావేశాలు లేక గ్రామస్థాయిలో ఆరు నెలలకోసారి గిరిజన దర్బారు నిర్వహించాలి. -
ప్రాణం తీసిన వాటర్ హీటర్
[ 30-11-2023]
వాటర్ హీటర్ కారణంగా విద్యుదాఘాతానికి గురై వివాహిత మృతి చెందిన ఘటన శ్రీకాకుళం నగరంలో చోటు చేసుకుంది.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 20,120
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
-
Kidnap: 25 మంది భద్రాద్రి జిల్లా వ్యాపారుల కిడ్నాప్
-
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?