logo

Crime News: తన భార్య అనుకొని వేరే మహిళను హత్య చేసిన వ్యక్తి

తన భార్య అనుకొని వేరొక మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాళాల వద్ద ఉన్న ఇందిరానగర్‌ పరిధికి చెందిన దేవేంద్రన్‌ పశువుల వ్యాపారి. అతడి మొదటి భార్య రేణుకామ్మాళ్‌ రెండు సంవత్సరాల క్రితం మృతి చెందింది.

Updated : 22 May 2022 11:40 IST

నిందితుడి అరెస్టు

గౌసర్‌ (పాత చిత్రం)

వేలూర్‌, న్యూస్‌టుడే: తన భార్య అనుకొని వేరొక మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాళాల వద్ద ఉన్న ఇందిరానగర్‌ పరిధికి చెందిన దేవేంద్రన్‌ పశువుల వ్యాపారి. అతడి మొదటి భార్య రేణుకామ్మాళ్‌ రెండు సంవత్సరాల క్రితం మృతి చెందింది. అదే పరిధికి చెందిన సురేష్‌ చనిపోవడంతో ఆయన భార్య ధనలక్ష్మిని దేవేంద్రన్‌ ఐదు నెలల క్రితం రెండో వివాహం చేసుకొన్నాడు. దంపతులు అప్పుడప్పుడు గొడవ పడేవాడు. ఈ కారణంగా ధనలక్ష్మి ఇటీవల ఆంబూరులోని పుట్టింటికి వెళ్లింది. ఆంబూర్‌ కంబికొల్లై పరిధికి చెందిన వ్యక్తి జాన్‌ బాషా. అతడి కుమారుడు నవీద్‌ బాషా ఒక చోరీ కేసులో అరెస్టై వేలూర్‌ కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఇతడి భార్య గౌసర్‌. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆంబూర్‌ రైల్వే స్టేషను ఎదురుగా ఉన్న నేతాజీ రోడ్డులో పాదరక్షలు విక్రయించే దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణాల ఎదుట రాత్రి సమయాల్లో యాచకులు, నిరాశ్రయులు నిద్రిస్తుంటారు. ధనలక్ష్మి కూడా రాత్రి సమయాల్లో ఆ దుకాణాల ఎదుట నిద్రిస్తున్నట్లు దేవేంద్రన్‌కు సమాచారం అందటంతో శుక్రవారం రాత్రి అక్కడికి వచ్చాడు. ధనలక్ష్మి, గౌసర్‌, ఆమె అత్త పర్వీన్‌, పిల్లలు నిద్రిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆంబూరు వచ్చిన దేవేంద్రన్‌ చీకట్లో ధనలక్ష్మి అనుకొని గౌసర్‌ను కత్తితో గొంతుపై, ఛాతీభాగంలో పొడిచాడు. ఈ ఘటనలో గౌసర్‌ తీవ్రంగా గాయపడింది. ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న ధనలక్ష్మికి కత్తి పోటు పడటంతో ఆమె నిద్ర లేచింది. స్థానికులు దేవేంద్రన్‌కు దేహశుద్ధి చేసి ఆంబూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చేసరికి గౌసర్‌ చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆంబూర్‌ ఆసుపత్రికి తరలించారు. ధనలక్ష్మిని వేలూర్‌ అడుకంపారై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

నిందితుడు దేవేంద్రన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని