‘జనని’ సేవలు ఆదర్శనీయం
జనని సాంఘిక సాంస్కృతిక సమితి తెలుగు కళామతల్లికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని ముఖ్యఅతిథిగా విచ్చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయవాది ఏఎన్ పురుషోత్తం అభివర్ణించారు. ‘జనని’ రజతోత్సవాలు మైలాపూరు ఆంధ్ర మహిళాసభలోని డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ సెంటినరీ హాలులో శనివారం రాత్రి వైభవంగా జరిగాయి.
పుస్తకావిష్కరణలో అతిథులు, నిర్వాహకులు
చెన్నై (సాంస్కృతికం), న్యూస్టుడే: జనని సాంఘిక సాంస్కృతిక సమితి తెలుగు కళామతల్లికి చేస్తున్న సేవలు ఆదర్శనీయమని ముఖ్యఅతిథిగా విచ్చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయవాది ఏఎన్ పురుషోత్తం అభివర్ణించారు. ‘జనని’ రజతోత్సవాలు మైలాపూరు ఆంధ్ర మహిళాసభలోని డాక్టర్ దుర్గాబాయి దేశ్ముఖ్ సెంటినరీ హాలులో శనివారం రాత్రి వైభవంగా జరిగాయి. ముందుగా డాక్టర్ నిర్మలా పళనివేలు అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో ‘జనని’ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య స్వాగతం పలుకుతూ సంస్థ పాతికేళ్ల ప్రస్థానం, దాతల సహకారం గురించి సంక్షిప్తంగా వివరించారు. సంస్థ ప్రత్యేక సంచికను పురుషోత్తం ఆవిష్కరించారు. తొలి ప్రతిని తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబుకు అందజేశారు. అనంతరం ప్రసంగిస్తూ తెలుగు భాషపై మక్కువతో పాతికేళ్లుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో పుస్తకాలను ప్రచురించిన ‘జనని’ సేవలు అనన్య సామాన్యమన్నారు. భవిష్యత్తులో స్వర్ణోత్సవం జరుపుకోవాలని ఆకాంక్షించారు. స్వీకర్త తమ్మినేని బాబు మాట్లాడుతూ ‘జనని’తో తమ సుదీర్ఘ అనుభవాన్ని గుర్తుకు తెచ్చారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య విస్తాలి శంకరరావు తన అభినందనలు తెలిపారు. దాతల సహాయసహకారాలతో ఓ వైపు కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు పలువురి రచనలను ముద్రించిన ఘనత జననికే చెందుతుందన్నారు. రజతోత్సవ సంచిక సంపాదకుడు డాక్టర్ ఉప్పలధడియం వెంకటేశ్వర మాట్లాడుతూ దాదాపు 40 మంది రచయితలు ఈ సంచికకు వ్యాసాలు పంపారని తెలిపారు. వసుంధరాదేవి ‘మా తెలుగుతల్లి’ ప్రార్థనతో మొదలైన కార్యక్రమం జాతీయ గీతాలాపనతో ముగిసింది. నగరంలోని తెలుగు ప్రముఖులు అనేకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్