Shashikala- Vijayashanthi: శశికళతో విజయశాంతి రహస్య భేటీ?
జయలలిత నెచ్చెలి శశికళతో భాజపా నాయకురాలు, ప్రముఖ నటి విజయశాంతి రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా తన తదుపరి రాజకీయ ప్రయాణం గురించి విజయశాంతిలో శశికళ సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది.
సైదాపేట, న్యూస్టుడే: జయలలిత నెచ్చెలి శశికళతో భాజపా నాయకురాలు, ప్రముఖ నటి విజయశాంతి రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా తన తదుపరి రాజకీయ ప్రయాణం గురించి విజయశాంతిలో శశికళ సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల శశికళ తన మద్దతుదారుల ఇంట కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పుడు విలేకర్లను కలిసి మాట్లాడుతున్నారు. కొన్ని నెలల క్రితం ఆధ్యాత్మిక యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాలను సందర్శించారు. పలు చోట్ల మద్దతుదారులను కలిసి ఆ సమయంలో మాట్లాడారు. రాజకీయ ప్రయాణం మళ్లీ ప్రారంభిస్తానని, అన్నాడీఎంకేకు తాను నాయకత్వం వహించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని ఇటీవల ఆమె చెప్పారు. పలువురు అన్నాడీఎంకే నేతలు తనను సంప్రదిస్తున్నారని, కొంత మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో శశికళను విజయశాంతి రహస్యంగా కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. శశికళ జైలు నుంచి వచ్చిన తర్వాత విజయశాంతి కలిశారు. తాజా భేటీలో శశికళ రాజకీయ భవిష్యత్ గురించి చర్చించినట్లు సమాచారం. జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకేను భాజపా నియంత్రిస్తోందనే ఆరోపణలు ఉన్నాయ. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన వారిని మళ్లీ పార్టీలోకి తెచ్చేందుకు యత్నాలు జరిగాయి. అయితే ఎడప్పాడి పళనిస్వామితో సహా సీనియర్ నేతలు ససేమిరా అనటంతో అవి ఫలించలేదు. ఈ నేపథ్యంలో 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ అన్నాడీఎంకే నుంచి వెళ్లిపోయిన వారిని పార్టీలో చేర్చే యత్నాల్లో భాజపా ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే విజయశాంతి తాజాగా శశికళను కలిసినట్లు రాజకీయ వర్గాల సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్