Crime News: నిత్యలక్ష్మి భర్త నిత్య పెళ్లి కొడుకు!
మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో వధువు కావాలని నమోదు చేసి బంగారు, నగదు కోసం మోసాలకు పాల్పడుతున్న భర్త, అతని కుటుంబంపై ఓ వివాహిత ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు.. చెన్నై, ఆవడి పట్టాభిరామ్ ప్రాంతానికి చెందిన నిత్యలక్ష్మి,
విజయకుమార్
చెన్నై(క్రైం), న్యూస్టుడే: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో వధువు కావాలని నమోదు చేసి బంగారు, నగదు కోసం మోసాలకు పాల్పడుతున్న భర్త, అతని కుటుంబంపై ఓ వివాహిత ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు.. చెన్నై, ఆవడి పట్టాభిరామ్ ప్రాంతానికి చెందిన నిత్యలక్ష్మి, కోయంబత్తూర్ చెందిన విజయకుమార్కి 2020 ఏప్రిల్లో వివాహమైంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఎనిమిది నెలల కుమారుడు ఉన్నాడు. విజయకుమార్ విదేశాల్లో ఉంటూ నిత్యలక్ష్మికి వేర్వేరు నంబర్లతో ఫోన్ చేసి మాట్లాడేవాడు. మూడు నెలల క్రితం నిత్యలక్ష్మికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన మహిళ తన పేరు నాథశ్రీ అని, విజయకుమార్ తనని అక్టోబర్లో పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు తనని మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పింది. వివరాలు వాట్సప్లో పంపించింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన నిత్యలక్ష్మి.. భర్త మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో వధువు కావాలని నమోదు చేసుకుని పదిమందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేశాడని తెలుసుకొంది. బంగారు, నగదు కోసం మహిళలను లక్ష్యంగా చేసుకొని విజయకుమార్ చెల్లెలు రేవతి, తండ్రి శక్తివేల్, అమ్మ హంసవేణి మోసానికి పాల్పడుతున్నట్లు బయటపడింది. దీనిపై ఆవడి ఆల్ వుమెన్ పోలీసుస్టేషన్లో నిత్యలక్ష్మి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపిస్తోంది. విజయకుమార్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని, 15 సవర్ల బంగారు నగలు, రూ.లక్ష నగదు ఇప్పించాలని డిమాండ్ చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు