Chess Grandslam: 14 ఏళ్ల చెన్నై బాలుడిని వరించిన గ్రాండ్స్లామ్..
చెన్నై కుర్రోడికి అపూర్వ గౌరవం దక్కింది. చెస్లో గ్రాండ్మాస్టర్ ఖ్యాతి దక్కించుకున్న 73వ టీనేజర్గా గుర్తింపు పొందారు. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ నుంచి ప్రశంసల్ని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ‘భరత్ సుబ్రమణియం’ ఆనందం అంతాఇంతా కాదు. ఈ మధ్యే ఇటలీలో వెర్గానీ కప్
ఎత్తులు వేయడంలో చిచ్చర పిడుగు!
విశ్వనాథన్ ఆనంద్ ప్రత్యేక అభినందనలు
భరత్ సుబ్రమణియం, విశ్వనాథన్ ఆనంద్
న్యూస్టుడే-విల్లివాక్కం చెన్నై కుర్రోడికి అపూర్వ గౌరవం దక్కింది. చెస్లో గ్రాండ్మాస్టర్ ఖ్యాతి దక్కించుకున్న 73వ టీనేజర్గా గుర్తింపు పొందారు. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ నుంచి ప్రశంసల్ని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ‘భరత్ సుబ్రమణియం’ ఆనందం అంతాఇంతా కాదు. ఈ మధ్యే ఇటలీలో వెర్గానీ కప్ జరుగుతోంది. భరత్ తన 9 రౌండ్లలో 7.5పాయింట్లను సాధించాడు. దీంతో అతను గ్రాండ్స్లామ్కు కావాల్సిన 2500 ఎలో పాయింట్ల రేటింగ్ దాటేశాడు. ఈ కప్లో భరత్కు 7వ స్థానం దక్కినప్పటికీ తనకు దక్కిన గ్రాండ్స్లామ్ ఖ్యాతికి ఎగిరి గంతేశాడు. ఈ కుర్రోడిలో కనిపించిన తపన, ఆటతీరు విశ్వనాథన్ ఆనంద్ను కట్టిపడేసింది. ఈ మధ్యే ఆయన ఓ ట్వీట్ చేస్తూ.. ‘గ్రాండ్స్లామ్ సాధించినందుకు అభినందనలు భరత్. ఇతనిలో నేర్పు ఉంది. గొప్పగా ఆడగలడు’ అని ప్రకటించారు. 14 ఏళ్ల వయసులోనే ఈ ఖ్యాతి సాధించడంపై చెన్నైలోని వారి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
చిన్న వయసులోనే..
ఇదివరకు టీనేజీల్లో గ్రాండ్స్లామ్ ఖ్యాతి దక్కించుకున్నవారిలో 18 ఏళ్లు, 15 ఏళ్లవారున్నారు. కానీ 14ఏళ్లకే సాధించడం ఓ రికార్డుగా క్రీడానిపుణులు చెబుతున్నారు. భరత్ చిన్న వయసునుంచే చెస్ ఆడటం నేర్చుకున్నారు. దీంతో వీలైనన్ని ఎక్కువ మెలకువలు, తెలివైన ఎత్తులతో కసరత్తు చేశారు. అతని తండ్రి ఎస్.హరిశంకర్ మాట్లాడుతూ.. ‘దేశవిదేశాల్లో ఆడే ఆటతో భరత్ రాటుతేలాడు. కానీ ఆ తరహా ఆటలంటే మా ఆర్థిక పరిస్థితుల రీత్యా కష్టమే. మా పొదుపు ఆ ఆటలకు ఏమాత్రం సరిపోదు, అయినా కష్టాల్ని ఓర్చి మా బిడ్డను పోటీలకు పంపుతున్నా’నని తెలిపారు. 5 ఏళ్ల వయసు నుంచి భరత్కు ఆయనే కోచ్గా వ్యవహరించారు. ఆ తర్వాత గ్రాండ్మాస్టర్ రామచంద్రన్ రమేష్ వద్ద భరత్ మరింత రాటుదేలాడు.
మరింత ముందుకు..
ప్రస్తుతం భరత్ ప్రపంచ చెస్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో 2,476వ స్థానంలో ఉన్నాడు. టీనేజీ కేటగిరీల్లో తన తఢాఖా చూపుతున్నారు. ప్రస్తుతం తన దృష్టంతా భవిష్యత్తులో జరిగే టోర్నీలపైనే ఉందని చెబుతున్న భరత్.. స్వయంగా విశ్వనాథన్ ఆనంద్ అభినందించడంపై ఆనందం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
[ 29-03-2024]
నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. -
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!