పథకాల లోటుపాట్లపై అధ్యయనం అవసరం
పథకాల లోటుపాట్లపై అధ్యయనం చేస్తేనే వాటి ఉద్దేశం నెరవేరుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 15 శాఖల ద్వారా అమలు చేసే 41 పథకాల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ (దిశ) కమిటీ ఏర్పాటైంది.
ముఖ్యమంత్రి స్టాలిన్
‘దిశ’ సమావేశంలో మాట్లాడుతున్న స్టాలిన్
డీఎంకే ఎంపీల వితరణ
చెన్నై, న్యూస్టుడే: శ్రీలంక సహాయార్థం డీఎంకే ఎంపీలు వితరణ అందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ను బుధవారం డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, ఆర్.ఎస్.భారతి కలిసి రూ.30 లక్షలను బ్యాంకు చెక్ రూపంలో అందించారు.
వైద్యవిద్యార్థుల వినతి
చెన్నై: వైద్యవిద్య కొనసాగించడానికి సహాయపడాలని ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన రాష్ట్ర విద్యార్థులు ముఖ్యమంత్రి స్టాలిన్ను కోరారు. బుధవారం సచివాలయంలో పలువురు సీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు.
శిక్షణ ఐఏఎస్ అధికారుల భేటీ
చెన్నై, న్యూస్టుడే: శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. 2020 బ్యాచ్ శిక్షణలోని ఐఏఎస్ అధికారులు శరణ్య, ఐశ్వర్య, ప్రియాంక, కరుతంజై నారాయణన్, కట్టా రవితేజ, అనామిక రమేశ్, కౌశిక్, ముహమ్మద్ షబీర్ అలామ్ అఫ్తాఫ్ రసూల్, గౌరవ్కుమార్, ఏకాంజేసింగ్ తదితరులు బుధవారం సచివాలయంలో సీఎంను కలిశారు.
కాల్పుల విచారణ నివేదిక అందజేత
చెన్నై, న్యూస్టుడే: తూత్తుకుడి తుపాకీ కాల్పుల విచారణ నివేదికను ముఖ్యమంత్రికి అందించారు. తూత్తుకుడిలోని స్టెరిలైట్ రాగి పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలో 2018లో పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు. ఇందులో 13 మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విచారణకు నియమించింది. ఈ నివేదికను సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రికి అరుణా జగదీశన్ అందించారు.
శ్రీలంకకు బయలుదేరిన నౌక
జెండా ఊపి నౌకను ప్రారంభిస్తున్న సీఎం
చెన్నై, న్యూస్టుడే: శ్రీలంక సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిత్యావసర సరకులతో కూడిన నౌక బుధవారం బయలుదేరింది. దానిని ముఖ్యమంత్రి స్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. తొలి విడతగా 9వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 200 మెట్రిక్ టన్నుల ఆవిన్ పాలపౌడరు, 24 మెట్రిక్ టన్నుల మందులను రాష్ట్రప్రభుత్వం పంపింది. సరకుల శాంపిళ్లను చెన్నైలోని శ్రీలంక డిప్యూటీ హై కమిషనరు వెంకటేశ్వరన్కు స్టాలిన్ అందించారు. కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్, కేఎన్ నెహ్రూ, చక్రపాణి, సుబ్రమణియన్, శేఖర్బాబు, మస్తాన్, పోర్ట్ ట్రస్ట్ డిప్యూటీ ఛైర్మన్ బాలాజీ అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దేవెగౌడకు జన్మదిన శుభాకాంక్షలు
చెన్నై, న్యూస్టుడే: మాజీ ప్రధాని దేవెగౌడకు ముఖ్యమంత్రి స్టాలిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం లభించాలంటూ సామాజిక మాధ్యమాల్లో బుధవారం పోస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు విజయ్ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!
[ 29-03-2024]
నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. -
అంతు చిక్కని ఓటరు నాడి!
[ 29-03-2024]
ఎన్నికల ఫలితాలు దేశమంతా ఒకలా ఉంటే.. తమిళనాడులో మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో ఓ తరహా తీర్పు, అసెంబ్లీ ఎన్నికల్లో మరో రకమైన తీర్పు ఇక్కడే కనిపిస్తుంటుంది. -
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
[ 29-03-2024]
రామనాథపురంలో ఐదుగురు ఓ పన్నీర్సెల్వంల నామినేషన్లు ఆమోదించారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన మాజీ సీఎం ఓ.పన్నీర్సెల్వం అన్నాడీఎంకే కార్యకర్తల హక్కుల పునరుద్ధరణ కమిటీ పేరుతో పనిచేస్తున్నారు. -
ప్రాణస్నేహితుల్లా మెలిగాం
[ 29-03-2024]
డీఎంకేపై వ్యరేతికతతో పార్టీలో చేరిన గణేశమూర్తి ఎంపీ అయ్యారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో గుర్తు చేశారు. ఆయన కోవై విమానాశ్రయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. -
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె శివగంగైలో నామినేషన్
[ 29-03-2024]
అన్నాడీఎంకే మాజీ మంత్రి కుమార్తె స్వతంత్ర అభ్యర్థిగా శివగంగై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు చేయడం కలకలం సృష్టించింది. -
ప్రధాని నాటకాలు ప్రజలకు తెలుసు
[ 29-03-2024]
ప్రధాని మోదీ ఎన్నికల నాటకాలు ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్లో డీఎంకే ఎన్నికల ప్రచార సమావేశం బుధవారం రాత్రి జరిగింది. -
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదు : కనిమొళి
[ 29-03-2024]
తమ గురించి మాట్లాడే అర్హత అన్నామలైకి లేదని డీఎంకే ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. కరూర్ వెంగమేడు అన్నా విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతిమణికి మద్దతుగా గురువారం ఆమె ప్రచారం చేశారు. -
కవిన్ డబ్బింగ్ పూర్తి
[ 29-03-2024]
బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ‘టాటా’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు కవిన్. ఆ చిత్రం విజయం తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఇళనుడన్ దర్శకత్వంలోని ‘స్టార్’ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా