కేంద్రంపై నిందలేయడమే డీఎంకే పని కాదు: శశికళ
కేంద్రప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తూ ఉండటం మాత్రమే డీఎంకే ప్రభుత్వం పనికాదని శశికళ అన్నారు. తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా శివగంగై జిల్లాలోని పలు ఆలయాలకు వెళ్లి శశికళ దర్శించుకున్నారు. అందులో భాగంగా రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.
వేలునాచ్చియార్ విగ్రహానికి నివాళి అలర్పిస్తున్న శశికళ
ఆర్కేనగర్, న్యూస్టుడే: కేంద్రప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తూ ఉండటం మాత్రమే డీఎంకే ప్రభుత్వం పనికాదని శశికళ అన్నారు. తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా శివగంగై జిల్లాలోని పలు ఆలయాలకు వెళ్లి శశికళ దర్శించుకున్నారు. అందులో భాగంగా రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. పైయూర్ ప్రాంతంలో ఉన్న వేలునాచ్చియార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ...అన్నాడీఎంకేలో చేరడం ఖాయమన్నారు. తదుపరి ప్రభుత్వం ఆ పార్టీదేనని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలు కష్టంలో ఉన్నారని తెలిపారు. హామీల్లో ఒక్కటి కూడా కూడా నెరవేర్చలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జయలలిత కేంద్రంపై నిందలు వేయలేదని, ప్రజలకు కావాల్సిన వాటి గురించి అడిగి తెలుసుకొని చేసేవారని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు ఎలాంటి మంచి చేయాలనేదాని గురించి మాత్రమే ఆలోచించాలని తెలిపారు. కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేయడమే డీఎంకే పనికాదని పేర్కొన్నారు.
‘అత్యవసర వస్తువుల జాబితాలో పత్తిని చేర్చాలి’
చెన్నై, న్యూస్టుడే: అత్యవసర వస్తువుల జాబితాలో పత్తిని చేర్చాలని టీఎన్సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో... తిరుప్పూర్ గార్మెంట్స్ రంగంలో ఏడాదికి రూ.50వేల కోట్ల ఎగుమతి, స్వదేశీ వ్యాపారం జరుగుతోందన్నారు. ఇక్కడ ఎక్కువగా ఉపయోగించే నూలు ధర పెరిగిందని తెలిపారు. తిరుప్పూర్ల్లో మాత్రమే 20వేలకుపైగా పరిశ్రమలు ఉన్నాయన్నారు. వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10లక్షల మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. పత్తిని అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చి జౌళి పరిశ్రమను కాపాడేందుకు ముందుకు రావాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరూరులో.. 4 ఈవీఎంలు!
[ 18-04-2024]
లోక్సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తిచేసింది. ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. -
ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
[ 18-04-2024]
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా.. -
సమస్యలు పరిష్కరించండి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. -
తెన్కాశిలో నెగ్గేదెవరు?
[ 18-04-2024]
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), -
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు
[ 18-04-2024]
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. -
ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
[ 18-04-2024]
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం -
ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య
[ 18-04-2024]
అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్ ప్రచారంలో మాట్లాడుతూ. -
మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు
[ 18-04-2024]
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పీఎఫ్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూర్. -
డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్
[ 18-04-2024]
డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?