వాటిని అన్నాడీఎంకే పాలనలో పట్టించుకోలేదు
గత డీఎంకే పాలనలో నిర్మించిన సమత్తువపురం ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకుండా 10ఏళ్లపాటు అన్నాడీఎంకే పక్కన పడేసిందని మంత్రి పెరియకరుప్పన్ తెలిపారు. శివగంగై జిల్లా సింగంపునరి సమీపంలోని కోట్టైవెంగైపట్టిలో మాజీ సీఎం కరుణానిధి పెరియార్ సమత్తువపురం పథకాన్ని గత డీఎంకే పాలనలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు.
మంత్రి పెరియకరుప్పన్
పనులు పరిశీలిస్తున్న మంత్రి, అధికారులు
ఆర్కేనగర్, న్యూస్టుడే: గత డీఎంకే పాలనలో నిర్మించిన సమత్తువపురం ఇళ్లను లబ్దిదారులకు కేటాయించకుండా 10ఏళ్లపాటు అన్నాడీఎంకే పక్కన పడేసిందని మంత్రి పెరియకరుప్పన్ తెలిపారు. శివగంగై జిల్లా సింగంపునరి సమీపంలోని కోట్టైవెంగైపట్టిలో మాజీ సీఎం కరుణానిధి పెరియార్ సమత్తువపురం పథకాన్ని గత డీఎంకే పాలనలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. కానీ తర్వాత అన్నాడీఎంకే అధికారంలోకి రావడంతో 10 ఏళ్లపాటు వాటిని పక్కనపడేసింది. దీంతో ఆ ఇళ్లు పాతబడిపోయాయి. అందువలన ఆ ఇళ్లను తిరిగి పునరుద్ధరించి కొత్త ఇళ్లుగా లబ్దిదారులకు అందించే చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా కోట్టైవెంగైపట్టిలోని పెరియార్ సమత్తువపురాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెరియకరుప్పన్, కలెక్టర్ మధుసూదన్రెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ....2011లో అధికారం చేపట్టిన అన్నాడీఎంకే ఇళ్లను లబ్దిదారులకు అందించలేదని తెలిపారు. స్టాలిన్ సీఎం అయిన తర్వాత పెరియార్ పేరిట ఉన్నవాటన్నింటినీ పునరుద్ధరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఏడాది 180 సమత్తువపురాలు పునరుద్ధరించేందుకు నిధులు కేటాయించారని చెప్పారు. తొలుత తిరువళ్లూర్, విళుపురం, కడలూర్, తిరుచ్చి, శివగంగై జిల్లాలలోని ఐదు సమత్తువపురాలు పునరుద్ధరించి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు. విళుపురంలోని సమత్తువపురాన్ని గత నెలలో ప్రజలకు అందజేయడంతో మంచి ఆదరణ లభించిందన్నారు. మిగిలిన నాలుగు జిల్లాల్లో పనులు జరుగుతున్నాయని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరూరులో.. 4 ఈవీఎంలు!
[ 18-04-2024]
లోక్సభ సమరంలో ఓటువేసే తేదీ వచ్చేసింది. 19.. అంటే రేపే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ పూర్తిచేసింది. ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. -
ఓటు భావితరాన్ని కాపాడాలి: స్టాలిన్
[ 18-04-2024]
ప్రజల ఓటు భావితరాన్ని కాపాడాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. డీఎంకే ఎంపీ అభ్యర్థులు కళానిధి వీరాసామి(ఉత్తర చెన్నై), దయానిధి మారన్(మధ్య చెన్నై), తమిళచ్చి తంగపాండియన్(దక్షిణ చెన్నై)కు మద్దతుగా.. -
సమస్యలు పరిష్కరించండి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అన్నానగర్లోని ‘ఫెడరేషన్ ఆఫ్ అన్నానగర్ రెసిడెంట్్స అసోసియేషన్స్’ (ఎఫ్ఏఎన్ఆర్ఏ) తమ డిమాండ్లను సెంట్రల్ చెన్నై లోక్సభ అభ్యర్థుల ముందుంచారు. -
తెన్కాశిలో నెగ్గేదెవరు?
[ 18-04-2024]
పశ్చిమ కనుమల్లోని తెన్కాశి నియోజకవర్గం పునర్విభజనకు ముందు పూర్తిగా తిరునెల్వేలి జిల్లాలో ఉండేది. ఆ తర్వాత తెన్కాశి, కడైయనల్లూర్, వాసుదేవనల్లూర్(రిజర్వు), శంకరన్కోవిల్(రిజర్వు), విరుదునగర్లోని శ్రీవిల్లిపుత్తూర్(రిజర్వు), -
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు
[ 18-04-2024]
దూరదృష్టితో అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తానని అన్నాడీఎంకే దక్షిణ చెన్నై అభ్యర్థి జయవర్ధన్ తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకుని అయోధ్యకుప్పంలోని రాముడి ఆలయంలో పూజల అనంతరం బుధవారం ప్రచారం చేశారు. -
ప్రజాసేవకు వచ్చాం: ప్రేమలత
[ 18-04-2024]
ప్రజలకు సేవ చేసేందుకు తాము వచ్చామని ప్రేమలతా విజయకాంత్ అన్నారు. విరుదునగర్ లోక్సభ స్థానంలో పోటీచేస్తున్న కుమారుడు విజయ ప్రభాకరన్కి మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతా బుధవారం -
ఇండియా కూటమిని గెలిపిస్తే అందరికీ సమాన విద్య
[ 18-04-2024]
అందరికీ సమానమైన విద్య అందించేందుకు ఇండియా కూటమికి ఓటు వేయాలని కనిమొళి తెలిపారు. డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, తూత్తుక్కుడి అభ్యర్థి కనిమొళి బుధవారం తిరుచ్చెందూర్ ప్రచారంలో మాట్లాడుతూ. -
మూడో ప్రయత్నంలో 871వ ర్యాంకు
[ 18-04-2024]
సివిల్ సర్వీసెస్ పరీక్షలో పీఎఫ్ కార్యాలయంలో సహాయకురాలిగా పనిచేస్తున్న ఇన్బ 851వ ర్యాంకు సాధించారు. ఆమె మాట్లాడుతూ.. నా సొంతూరు తెన్కాశి జిల్లా వాసుదేవనల్లూర్. -
డీఎంకే, భాజపాకు ఓటు వేయటం ఒకటే: ఈపీఎస్
[ 18-04-2024]
డీఎంకే, భాజపాలకు ఓటేయటం ఒకటేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో...
తాజా వార్తలు (Latest News)
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?