logo

రామనాథపురం సంస్థాన యువరాజు కన్నుమూత

రామనాథపురం సంస్థాన యువరాజు, రామేశ్వరం రామనాథ స్వామి ఆలయ తర్కార్‌ ‘రాజా నాగేంద్ర కుమరన్‌ సేతుపతి’ (56) మంగళవారం ఉదయం గుండె పోటుతో కన్నుమూశారు. రాజభవనంలో కుటుంబంతో కలిసి నివసిస్తూ వచ్చిన ఆయన అన్నామలై, తంజావూరు తమిళ విశ్వవిద్యాలయాల సెనేట్‌ సభ్యుడిగానూ వ్యవహరించారు.

Published : 25 May 2022 01:29 IST

రాజా కుమరన్‌ సేతుపతి (పాతచిత్రం)

వేలచ్చేరి, చెన్నై, న్యూస్‌టుడే: రామనాథపురం సంస్థాన యువరాజు, రామేశ్వరం రామనాథ స్వామి ఆలయ తర్కార్‌ ‘రాజా నాగేంద్ర కుమరన్‌ సేతుపతి’ (56) మంగళవారం ఉదయం గుండె పోటుతో కన్నుమూశారు. రాజభవనంలో కుటుంబంతో కలిసి నివసిస్తూ వచ్చిన ఆయన అన్నామలై, తంజావూరు తమిళ విశ్వవిద్యాలయాల సెనేట్‌ సభ్యుడిగానూ వ్యవహరించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలపడంతో పాటు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రాజా నాగేంద్ర కుమరన్‌ సేతుపతి మరణించడం దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన సంతాప ప్రకటనలో తెలిపారు. ఆలయం, విద్యాసంస్థల బాద్యతల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఆయన అకస్మాత్తుగా మరణించడం తీరని లోటు అన్నారు. ఆయన్ను కోల్పోయి బాధపడుతున్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని