అన్నా వర్సిటీలో ఆరుగురికి కరోనా
అన్నా విశ్వవిద్యాలయంలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ నేరుగా వెళ్లి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మద్రాసు ఐఐటీలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల ద్వారా కొన్ని రోజుల క్రితం కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది
వైద్యులతో చర్చిస్తున్న ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్
ప్యారిస్, న్యూస్టుడే: అన్నా విశ్వవిద్యాలయంలో ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ నేరుగా వెళ్లి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మద్రాసు ఐఐటీలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల ద్వారా కొన్ని రోజుల క్రితం కొవిడ్ వ్యాప్తి ప్రారంభమైంది. అనంతరం ఐఐటీఎం ప్రాంగణంలో ఉన్న హాస్టల్, కార్యాలయాల్లో ఉన్న విద్యార్థులు, ఫ్రొఫెసర్లు, సిబ్బందికి పరీక్షలు చేయడంతో, 198 మందికి కరోనా నిర్ధారించారు. అందరినీ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో చెన్నై గిండిలో ఉన్న అన్నా వర్శిటీలో కొన్ని రోజుల ముందు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కొందరికి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో 40 మందికి పరీక్షలు చేయగా సోమవారం ఆరుగురికి కరోనా నిర్థారణ అయింది. వారికి సన్నిహితంగా ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకుగాను ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. కరోనా నిర్థారణ అయిన వారికి చికిత్స అందించడానికి అవసరమైన చర్యలను చేపట్టారు.
‘కొవిడ్ తక్కువగా ఉందని నిర్లక్ష్యం వద్దు’
ప్యారిస్, వేలచ్చేరి, న్యూస్టుడే: కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్న జిల్లాల్లో అధికారులు నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. మంకీ ఫీవర్ వ్యాపిస్తున్న స్థితిలో రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రబలితే చికిత్స అందించడంపై వైద్యులకు ఓమందూర్ ఆస్పత్రిలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. దీన్ని రాధాకృష్ణను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.... చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కరోనా ఉందన్నారు.
ఆందోళన అనవసరం
మంకీ ఫాక్స్ వ్యాధి గురించి ఆందోళన అవసరం లేదని ఆరోగ్య శాఖ మంత్రి మా.సుబ్రమణియన్ తెలిపారు. కన్యాకుమరి ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి మనో తంగరాజ్తో కలిసి ఆయన పరిశీలించారు. అది అంటు వ్యాధి కాదని డబ్ల్యుహెచ్ఓ తెలిపిందని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
[ 19-04-2024]
వేలూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. -
పాదచారుల సబ్వే త్వరగా తెరవండి
[ 19-04-2024]
పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు. -
ఓటేద్దాం.. పదండి
[ 19-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీపడుతున్న అభ్యర్థుల భవితవ్యం ఈరోజు ఈవీఎంల్లో భద్రంగా నమోదవనుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటేసేందుకు 25 కి.మీ. నడక
[ 19-04-2024]
తిరునెల్వేలి జిల్లాకు చెందిన కొందరు ఓటేసేందుకు కి.మీ. కొద్దీ నడిచివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఇంజిక్కుళి గ్రామస్థులు సుమారు 60 ఏళ్ల కింద పశ్చిమ కనుమలపైనున్న అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. -
గోట్లో విజయకాంత్
[ 19-04-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ‘గోట్’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. -
మద్యం తాగడానికి డబ్బుల్లేవని బిడ్డ చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్తో కాల్చిన తండ్రి
[ 19-04-2024]
తంజావూర్ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది. -
పర్యాటకంపై పెరిగిన ఆసక్తి
[ 19-04-2024]
నగరంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో వేసవి సెలవులు గడిపేందుకు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. -
శ్రీలంక తమిళ మహిళ ఓటరు కార్డు రద్దు
[ 19-04-2024]
శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో ఉన్న మహిళకు ఇచ్చిన ఓటరు కార్డును రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి, తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్కుమార్ ప్రకటించారు. తిరుచ్చి జిల్లా కొట్టపట్టు ప్రాంతంలో శ్రీలంక తమిళుల పునరావాస శిబిరం ఉంది. -
రోడ్డులేక.. నడకమార్గంలో..
[ 19-04-2024]
నామక్కల్ జిల్లా రాశిపురం తాలూకా వెణ్ణత్తూర్ పంచాయతీ యూనియన్ పరిధిలోని బోదమలై 7 కి.మీ. ఎత్తులో ఉంది. ఇక్కడి కీళూర్, మేలూర్, కెడమలై గ్రామాల్లో 1,500 మందికి పైగా జనాభా ఉన్నారు. -
నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలి
[ 19-04-2024]
భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 6న తాంబరం రైల్వేస్టేషన్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టగా తిరునెల్వేలి భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్ కారు డ్రైవరు సతీష్, సహాయకుడి నుంచి రూ.4 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!