ఉద్యోగాన్ని వదిలి... గిరిజనుల విద్యకు కదిలి..
విద్యతోనే సామాజిక మార్పు వస్తుందని బలంగా నమ్ముతూ.. విద్యను ప్రతి ఒక్కరి చెంతకూ చేర్చాలని భావించి ఉద్యోగాన్ని సైతం వదిలి గిరిజనుల విద్య కోసం కంకణబద్ధులయ్యారు రాణిపేట్టై జిల్లాకు చెందిన సుగంధి వినోదిని. ఆమె వెంట పుస్తకాల సంచులతో వరుసకట్టి నిల్చున్నారు
చదువుతోనే సామాజిక మార్పు తథ్యమంటున్న సుగంధి వినోదిని
గిరిజన పిల్లలతో ..
సైదాపేట, న్యూస్టుడే: విద్యతోనే సామాజిక మార్పు వస్తుందని బలంగా నమ్ముతూ.. విద్యను ప్రతి ఒక్కరి చెంతకూ చేర్చాలని భావించి ఉద్యోగాన్ని సైతం వదిలి గిరిజనుల విద్య కోసం కంకణబద్ధులయ్యారు రాణిపేట్టై జిల్లాకు చెందిన సుగంధి వినోదిని. ఆమె వెంట పుస్తకాల సంచులతో వరుసకట్టి నిల్చున్నారు అణగారిని గిరిజన సామాజిక వర్గానికి చెందిన పిల్లలు. రాణిపేట్టై జిల్లా అరక్కోణం ప్రాంతంలో ఉండే గిరిజన కాలనీలో నివశిస్తున్న పిల్లలను పాఠశాలలో చేర్చి, వారి విద్యాభ్యాసానికి కృషి చేస్తున్నారు సుగంధి. సత్యభామ వర్సిటీలో ఆచార్యురాలిగా పని చేస్తూ వచ్చిన ఆమె అణగారిన సామాజిక వర్గాల పిల్లల చదువు కోసం తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి పిల్లల చదువు కోసం నడుంబిగించారు. అరక్కోణం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే కన్నివేడు, వేలూర్పేట్టై, గుంబినిపేట్టై, సిత్తూరు, మిట్టపేట్టై తదితర గిరిజన నివాస ప్రాంతాల్లో ఉండే పిల్లలను పాఠశాలలో చేర్పించటమే కాకుండా వారికి అవసరమైన ఏకరూప దుస్తులు, పాదరక్షలు, నోటు పుస్తకాలు సమకూరుస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల దూరంగా ఉండే పిల్లలకు సైకిళ్లు కూడా కొనిస్తున్నారు. బాలికలు పాఠశాలకు వెళ్లేందుకు ఆటోలు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలను పాఠశాలలో చేర్చేందుకు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావటంతో కుల ధ్రువీకరణ పొందే హక్కుల కోసం పాటుపడుతున్నారు.
రంగంలోకి దిగిన కలెక్టర్
గిరిజనుల విద్యకు సంబంధించి రాణిపేట్టై కలెక్టర్ భాస్కరపాండియన్ను కలిసి వినతి పత్రం అందించారు. వినతి పత్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వెంటనే రంగంలోకి దిగారు. గిరిజన నివాస ప్రాంతాలకు ప్రత్యక్షంగా వెళ్లిన కలెక్టర్ ఒక్కో ఇంటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత 45 మంది గిరిజన పిల్లలకు కుల ధ్రువీకరణ పత్రం అందించేందుకు చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... తర్వాతి తరంవారు ఇలాంటి పరిస్థితి నుంచి విముక్తి పొంది మంచి స్థితికి చేరే విధంగా విద్య వారికి సులభంగా లభించాలని తెలిపారు. ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయాలు చేసేందుకు ఆదేశించిందని, కావున పిల్లలను చదివించాలని గిరిజన ప్రజలను కోరారు. ఇతరుల మాటలు పట్టించుకోకుండా భావితరాన్ని మంచి స్థితికి తెచ్చేందుకు తల్లిదండ్రులు ప్రతిన బూనాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా గిరిజన నివాస ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, అన్ని సమస్యలూ పరిష్కరిస్తారని కలెక్టర్ హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుగంధి వినోదిని చొరవను కలెక్టర్ అభినందించారు.
వారి కోసం పాటుపడతా..
గిరిజన సామాజిక వర్గ జీవనోపాధి మెరుగుపడాలని, వారి పిల్లలకు విద్య దక్కాలంటున్నారు సుగంధి. ఇందుకు ఆటంకంగా ఉండే అవాంతరాలన్నీ తొలగించాలనే లక్ష్యంతో పని చేస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగా ఈ పిల్లలకు ముందే ఆధార్ కార్డులు ఇప్పించామన్నారు. చాలా దూరం వెళ్లి రేషన్ సరుకులు తీసుకోవాల్సిన స్థితిలో ఉన్న మూడు గిరిజన కాలనీల ప్రజల సమస్యలను ప్రాంతీయ పంపిణీ అధికారి ద్వారా పరిష్కరించామని వెల్లడించారు. 10వ తరగతి చదివిన గిరిజన విద్యార్థి ఒకరు ఐటీఐ చదివేందుకు ఆశపడి కుల ధ్రువీకరణ పత్రం లేకపోవటంతో చదవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే నాల్గవ తరగతి చవివే విద్యార్థిని సామాజిక సమస్యల కారణంగా పాఠశాలకు వెళ్లేందుకు భయపడి ఇంట్లోనే ఉంటోందని తెలిపారు. ఈ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిర్బంధ విద్య ప్రాతిపదికన ఈ విద్యార్థినిని మళ్లీ పాఠశాలలో చేర్పించామన్నారు. గిరిజన నివాస ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్తు తదితర సౌకర్యాలు లేవని, ఇళ్ల పట్టాలతో అన్ని కనీస అవసరాలు పూర్తి చేయాలని కలెక్టర్ను కోరామని తెలిపారు. త్వరలో అన్ని సదుపాయాలు వారికి దుక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు. వారి జీవితం మెరుగుపడేందుకు, వారి హక్కుల కోసం పాటుపడుతూనే ఉంటానని వెల్లడించారు సుగంధీ.
సుగంధి చొరవతో కుల ధ్రువీకరణ పత్రాలు అందిస్తున్న కలెక్టర్
విద్యార్థినితో..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ