logo

స్నేహితుడిని స్మరిస్తూ శిరస్త్రాణాల వితరణ

ప్రమాదంలో మృతి చెందిన యువకుడి వర్ధంతి సందర్భంగా అతని స్నేహితులు ఉచితంగా హెల్మెట్‌లను అందించారు. మదురై జిల్లా ఉసిలంపట్టికి చెందిన అలెక్స్‌ పాండియన్‌ (25) ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ గత ఏడాది మరణించారు.

Published : 25 May 2022 01:29 IST

హెల్మెట్‌ అందిస్తున్న దృశ్యం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ప్రమాదంలో మృతి చెందిన యువకుడి వర్ధంతి సందర్భంగా అతని స్నేహితులు ఉచితంగా హెల్మెట్‌లను అందించారు. మదురై జిల్లా ఉసిలంపట్టికి చెందిన అలెక్స్‌ పాండియన్‌ (25) ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ గత ఏడాది మరణించారు. ద్విచక్ర వాహనంపై హెల్మెట్‌ లేకుండా వెళుతుండగా జరిగిన ప్రమాదంలో అతను మృతిచెందారు. స్నేహితుని తొలి వర్ధంతి సందర్భంగా సోమవారం అతనితో పాటు కార్యాలయంలో పనిచేసిన స్నేహితులు దిసైయన్‌విళై పోలీస్‌స్టేషన్‌ ముందు హెల్మెట్‌ లేకుండా వెళుతున్న ద్విచక్ర వాహన చోదకులకు ఉచితంగా హెల్మెట్‌లు అందించారు. హెల్మెట్‌ ధరించడం వలన కలిగే ప్రయోజనాలు వివరిస్తూ పోలీసులు హెల్మెట్‌లు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని