చెన్నైలో ‘రోప్కార్’కు సన్నాహాలు
చెన్నై పర్యాటకులను ఆకర్షించేవిధంగా సింగార చెన్నై 2.0 పథకం ద్వారా నగరంలో రోప్కార్ సేవను ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు సమాచారం వెల్లడైంది. చెన్నై కార్పొరేషన్ తరఫున గ్రీన్ చెన్నై, కల్చరల్ చెన్నై, క్లీన్ చెన్నై, హెల్తీ చెన్నై, ఎడ్యుకేషనల్ చెన్నై తదితర పలు పనులు నిర్వహిస్తున్నారు.
రోప్కార్ నమూనా
ఆర్కేనగర్, న్యూస్టుడే: చెన్నై పర్యాటకులను ఆకర్షించేవిధంగా సింగార చెన్నై 2.0 పథకం ద్వారా నగరంలో రోప్కార్ సేవను ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు సమాచారం వెల్లడైంది. చెన్నై కార్పొరేషన్ తరఫున గ్రీన్ చెన్నై, కల్చరల్ చెన్నై, క్లీన్ చెన్నై, హెల్తీ చెన్నై, ఎడ్యుకేషనల్ చెన్నై తదితర పలు పనులు నిర్వహిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేవిధంగా భారీ రంగులరాట్నాలతో కూడిన ఉద్యానాల ఏర్పాటు, సముద్రతీర రహదారుల సుందరీకరణ వంటి పనులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చెన్నై మెరినా సముద్రతీరం తదితర కొన్ని ప్రాంతాలలో రోప్కార్ వసతిని ప్రారంభించేందుకు నిర్ణయించారని తెలిసింది. ఇటీవల మున్సిపాలిటీ నిర్వహణశాఖ మంత్రి కేఎన్ నెహ్రూ మాట్లాడుతూ.. సింగార చెన్నై 2.0 పథకంలో నగరాన్ని సుందరీకరించేందుకు సలహాలు ఇవ్వాలని కోరారు. అనేకమంది కౌన్సిలర్లు స్పందించారు. రోప్కార్ వసతిని ప్రారంభించవచ్చని కొందరు చెప్పారు.
నేప్పియార్ వంతెన
సముద్రతీరంలో.. చెన్నైలో ముఖ్య పర్యాటక ప్రదేశంగా ఉన్న మెరినా బీచ్లో రోప్కార్ సేవలను ప్రారంభించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం వెల్లడైంది. చెన్నై కార్పొరేషన్కు చెందిన అధికారులు, ఇంజినీర్లు పలు కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదటి విడతగా నేప్పియార్ వంతెన నుంచి నమ్మ చెన్నై సెల్ఫీ పాయింట్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ప్రారంభించే అవకాశాలున్నాయి. తర్వాత రాయపురం రైల్వేస్టేషన్ నుంచి నేప్పియార్ వంతెన వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సింగార చెన్నై 2.0 పథకానికిగాను తీసుకుంటున్న నిర్ణయాలు, కొత్త పథకాలు త్వరలో అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు సమాచారం.
నమ్మ చెన్నై పాయింట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత