రాష్ట్రవ్యాప్తంగా 21 చోట్ల సోదాలు
రాష్ట్రమంతటా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ అనే ప్రైవేటు సంస్థకు సంబంధించిన 21 ప్రదేశాలలో ఆర్థికనేరాల నియంత్రణ విభాగ పోలీసులు దాడులు చేశారు. వేలూం్ ప్రధాన కార్యాలయంగా ఈ సంస్థను వేదనారాయణ, లక్ష్మినారాయణ అనే సోదరులు నడుపుతున్నారు.
ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహణ
సత్తువచ్చారిలో ఉన్న ఐఎఫ్ఎస్ ప్రధాన కార్యాలయం
వేలూరు, ట్రిప్లికేన్, కాంచీపురం, న్యూస్టుడే: రాష్ట్రమంతటా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సర్వీస్ అనే ప్రైవేటు సంస్థకు సంబంధించిన 21 ప్రదేశాలలో ఆర్థికనేరాల నియంత్రణ విభాగ పోలీసులు దాడులు చేశారు. వేలూం్ ప్రధాన కార్యాలయంగా ఈ సంస్థను వేదనారాయణ, లక్ష్మినారాయణ అనే సోదరులు నడుపుతున్నారు. ఈ సంస్థలో రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.ఎనిమిది వేలు ఇస్తామని మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా దీనికి చెందిన 21 ప్రదేశాలలో శుక్రవారం ఈ దాడులు చేపట్టారు. చెన్నై, కాంచీపురం, వేలూం్, అరక్కోణం, నెమిలి తదితరచోట్ల ఇవి జరిగాయి. గిండిలో ఉన్న తామరై టెన్ పార్క్ భవనంలో నడుస్తున్న కార్యాలయం, మైలాపూం్, పోరూం్ తదితర నాలుగు ప్రదేశాలలో అధికారులు సోదాలు చేశారు. రూ.లక్ష చెల్లిస్తే నెలకు రూ.30 వేలు వంతున వడ్డీ ఇస్తామని ఆరుద్రఫైనాన్స్ సంస్థ మోసానికి పాల్పడినట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. మే 24వ తేదీన ఆర్థికనేరాల నియంత్రణ విభాగ పోలీసులు ఆ సంస్థ, సంబంధిత 26 ప్రదేశాలలో ఆకస్మిక దాడులు చేశారు. లెక్కలోనికి రాని రూ.3.41 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 81 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. దీనిపై ఆరుద్ర ఫైనాన్స్ సంస్థ డైరెక్టర్లు 14 మందిపై, ఆ పేరిట నడుస్తున్న ఐదు సంస్థలపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఐఎఫ్ఎస్ సంస్థపై కూడా అదే తరహా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో దీనిపై లోతైన దర్యాప్తునకు నగర పోలీసు కమిషనం్ శంకం్ జివాల్ ఆదేశించారు. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన ఈ సోదాల్లో భాగంగా సత్తువాచ్చారిలోని కార్యాలయానికి అధికారులు వెళ్లారు. దీంతో అక్కడి ఏజెంట్లు పారిపోయారు. కాట్పాడి ఆక్సీలియం కళాశాల రోడ్డు, వీజీరావ్ నగర్, నెమిలి తదితర కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. కాంచీపురంలోని సంస్థ స్థానిక డైరెక్టరు ఇంట్లో సోదాలు తర్వాత నివాసానికి సీలు వేశారు. సంస్థతో సంబంధం ఉన్న వారి ఇళ్లలోనూ దాడులు జరిపారు. పచ్చయప్పన్ మహిళా కళాశాల సమీపంలో ఉన్న మిన్మినీ శరవణన్ ఇంట్లో తనిఖీలు చేశారు.
సోదాలు చేస్తున్న పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్