కరుణను స్మరిస్తూ భారీ మారథాన్
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా నగరంలో భారీ అంతర్జాతీయ మారథాన్ నిర్వహించారు. ఇందులో డీజీపీ తదితర పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ముఖ్యమంత్రి స్టాలిన్ నగదు బహుమతి ప్రదానం చేశారు
ఎగ్మూరు ప్రభుత్వ పిల్లల ఆసుపత్రికి విరాళం అందజేస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్
చెన్నై, న్యూస్టుడే: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా నగరంలో భారీ అంతర్జాతీయ మారథాన్ నిర్వహించారు. ఇందులో డీజీపీ తదితర పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ముఖ్యమంత్రి స్టాలిన్ నగదు బహుమతి ప్రదానం చేశారు. కరుణానిధి 4వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఈ మారథాన్ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ఏర్పాటు చేశారు. బెసెంట్ నగర్లోని ఆల్కాట్ పాఠశాల ప్రాంగణం నుంచి 4 విభాగాలుగా పోటీలు జరిగాయి. 5 కి.మీ. మారథాన్ను చేపాక్-ట్రిప్లికేన్ ఎమ్మెల్యే ఉదయనిధి, 10 కి.మీ. పోటీని మున్సిపల్ పరిపాలనశాఖ మంత్రి కేఎన్ నెహ్రూ, 21 కి.మీ. మారథాన్ను ప్రజాపనులశాఖ మంత్రి ఏవీ వేలు, 42 కి.మీ. పోటీని క్రీడలశాఖ మంత్రి మెయ్యప్పన్ ప్రారంభించారు. మారథాన్ కొనసాగిన మార్గంలో తమిళ సంస్కృతిని ప్రతిబింబించేలా తిరువణ్ణామలై పెరియ మేళం, కారమడై తుడుంబాట్టం, రామనాథపురం జింబళా మేళం వంటి 8 రకాల మేళ వాద్యాలు వాయించారు. మారథాన్లో పాల్గొన్నవారి కోసం 12 చోట్ల తాగునీరు, పుచ్చకాయలు, బత్తాయి రసం, అరటిపళ్లు వంటివి అందించారు.
నగదు బహుమతుల ప్రదానం
5 కి.మీ. పోటీల్లో తొలి బహుమతిగా మణిశరత్కు రూ.25వేలు, రెండో బహుమతిగా ధనేచ్కు రూ.15 వేలు, 10 కి.మీ. పోటీలో తొలి మూడు స్థానాలు సాధించిన కోయంబత్తూరుకు చెందిన సతీశ్కుమార్కు రూ.50వేలు, ఉత్తరప్రదేశ్కు చెందిన దశంత్కుమార్కు రూ.25వేలు, రాజస్థాన్కు ఎందిన రామ్పాల్కు రూ.15వేలు అందించారు. అలాగే 21 కి.మీ మారథాన్లో పుదుకోట్టైకు చెందిన సైనికుడు లక్ష్మణన్ గోవింద్కు రూ.లక్ష, రెండో బహుమతిగా తేనికి చెందిన సైనికుడు రాజ్కుమార్కు రూ.50వేలు, మూడో బహుమతిగా ఉత్తరప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్కు రూ.25వేలు, 42 కి.మీ. పోటీలో జైపూర్కు చెందిన సబ్ ఇన్స్పెక్టరు షేర్సింగ్కు రూ.లక్ష, బహుమతులు, 12 మంది మహిళలకు ప్రత్యేక బహుమతిగా రూ.5 వేల చొప్పున ప్రదానం చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖులు
మారథాన్లో డీజీపీ శైలేంద్రబాబు, ఇండియన్ ఆర్మీ దక్షిణ భారత ఏరియా చీఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ దహియా, ఇండియన్ నేవీ ఉన్నతాధికారి కమాండర్ సురేశ్, ఇంగ్లండ్లోని అమెష్బరీ నగర డిప్యూటీ మేయర్ మోనికా దేవేంద్రన్, చూపు కోల్పోయిన పంజాబ్కు చెందిన క్రీడాకారుడు చావ్లా తదితరులు పాల్గొన్నారు. వారిని ముఖ్యమంత్రి సత్కరించి, ధ్రువపత్రాలు ప్రదానం చేశారు. అమెరికా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ తదితర దేశాల దౌత్యాధికారులు, మారథాన్కు విరాళాలు అందించిన దాతలను సత్కరించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్ముడి, రఘుపతి, పెరియకరుప్పన్, మస్తాన్, అన్బిల్ మహేశ్ పొయ్యామొళి, కయల్విళి, ఎంపీలు టీఆర్ బాలు, తమిళచ్చి తంగపాండియన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్