‘అమ్మ మినీ క్లినిక్’లను మళ్లీ ప్రారంభించాలి
ప్రజల క్షేమం కోసం అమ్మ మినీ క్లినిక్ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో.... పేద, మధ్యతరగతి ప్రజలు తమ ఇళ్ల సమీపంలో చికిత్స పొందేలా ఈ పథకం ప్రారంభించినట్లు గుర్తుచేశారు.
ఎడప్పాడి డిమాండ్
ప్యారిస్, న్యూస్టుడే: ప్రజల క్షేమం కోసం అమ్మ మినీ క్లినిక్ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో.... పేద, మధ్యతరగతి ప్రజలు తమ ఇళ్ల సమీపంలో చికిత్స పొందేలా ఈ పథకం ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ప్రజల నుంచి ఆదరణ పొందిందని, డీఎంకే ప్రభుత్వం రాజకీయ కక్ష కారణంగా ఈ పథకాన్ని నిలిపివేసిందన్నారు. మక్కలై తేడి మరుత్తువం అనే ఉపయోగం లేని పథకాన్ని పరిచయం చేసిందన్నారు. ఈ పథకం గురించి ప్రజలకు తెలియలేదని పేర్కొన్నారు. మొదటి రోజు మందులు ఇచ్చి వెళ్లిన వారు, ఇప్పటి వరకు మళ్లీ వచ్చి వివరాలు తెలుసుకోవడం లేదని ఆరోపించారు. తాము గతంలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు నిలిపివేసి ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందన్నారు. కరోనాకు మొదటి వేవ్ సమయంలో పలు ప్రైవేటు ఆస్పత్రులు పనిచేయని స్థితిలో, ఇప్పుడున్న అదే ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు చికిత్స అందించారని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజలు వెళ్లడానికి భయపడే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. పేరుకే మక్కలై తేడి మరుత్తువం పథకాన్ని ప్రకటించారని, ముఖ్యమంత్రితో ఫొటో షూట్ నిర్వహించి, ప్రజలను వైద్యం కోసం ఇబ్బంది పెట్టే ధోరణి మానుకోవాలని పేర్కొన్నారు. కక్ష సాధింపు రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల క్షేమం కోసం అమ్మ మినీ క్లీనిక్లను మళ్లీ ప్రారంభించాలని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీలు మంచి చేస్తే రాజకీయాల్లోకి రాను: నటుడు విశాల్
[ 23-04-2024]
రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే, తనలాంటి వారు ఎల్లప్పుడూ ఓటర్లగానే మిగిలిపోతారని నటుడు విశాల్ తెలిపారు. -
వారి చొరవ స్ఫూర్తిదాయకం
[ 23-04-2024]
గత నాలుగు లోక్సభ ఎన్నికల్లో అత్యంత తక్కువ పోలింగ్ ఈసారి రాష్ట్రంలో నమోదైంది. చాలా స్థానాల్లో 60శాతం పోలింగ్ దాటేందుకూ అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. -
ఓటేయడాన్ని అడ్డుకున్న ఘటనపై దర్యాప్తు
[ 23-04-2024]
కాంచీపురం జిల్లా పరందూర్ సమీపంలో చెన్నై గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. -
దక్షిణాది నుంచే భాజపాకు పతనం ఆరంభం
[ 23-04-2024]
భారతీయ జనతా పార్టీ (భాజపా)కు దక్షిణాది నుంచే పతనం ప్రారంభమైందని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. -
తగ్గిన ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం
[ 23-04-2024]
మెట్రో రెండో దశలో చేట్పేట్, కీల్పాక్ మెట్రో స్టేషన్ల మధ్య భూగర్భంలో జరుగుతున్న పనులు చేట్పేట్ చెరువు కింద సబర్బన్ స్టేషను ప్రాంతానికి చేరుకున్నాయి. -
20 రోజుల్లో రూ.190 కోట్లు
[ 23-04-2024]
చెన్నై కార్పొరేషన్లో ఏప్రిల్ 20 వరకు రూ.190 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5శాతం రాయితీ పొందొచ్చని కార్పొరేషన్ ప్రకటించింది. -
త్యాగానికి చిహ్నం కాషాయం
[ 23-04-2024]
కాషాయ రంగు త్యాగానికి చిహ్నమని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. దూరదర్శన్ లోగోను కాషాయ రంగులోకి మార్చడాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించిన నేపథ్యంలో తమిళిసై తన ఎక్స్ పేజీలో స్పందించారు. -
12 జిల్లాల సరిహద్దుల్లో సోదాలు
[ 23-04-2024]
తమిళనాడులో 12 జిల్లాల సరిహద్దుల్లో ఫ్ల్లయింగ్స్క్వాడ్ సోదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు తెలిపారు. -
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో టోకెన్ ఇచ్చి గెలవలేదు
[ 23-04-2024]
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో టోకెన్ ఇచ్చి గెలవలేదని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలిపారు. తేని జిల్లా కంభంలో జరిగిన గోపాలన్ ఆలయ చిత్తిరై తిరునాళ్లలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. -
మాణిక్కం ఠాగూర్పై అనర్హతవేటు వేయాలన్న పిటిషన్ కొట్టివేత
[ 23-04-2024]
విరుదునగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్పై అనర్హత వేటు వేయాలని కోరిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. -
తండ్రిని చంపిన కుమారుడు
[ 23-04-2024]
తూత్తుక్కుడి సెలసీని కాలనీకి చెందిన సత్యమూర్తి, అనుసూయ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. మద్యానికి బానిసైన సత్యమూర్తి రోజూ భార్యను, పిల్లలను హింసించేవాడు. -
ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు
[ 23-04-2024]
లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు శిక్ష పడింది. శివగంగై జిల్లా కాలైయార్కోవిల్ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా 2014లో మురుగన్ (54) పనిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ