logo

మహిళపై సామూహిక అత్యాచారం

పోరూర్ వద్ద కారులో వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నలుగుర్ని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... చెన్నై పోరూం్కి చెందిన 40 ఏళ్ల మహిళ సోమవారం రాత్రి కారులో వెళ్తున్నారు. అప్పుడు పోరూం్ సమీపం అయ్యప్పన్‌తాంగల్‌ వద్ద గుర్తుతెలియని నలుగురు

Published : 11 Aug 2022 01:17 IST

చెన్నై (క్రైం), న్యూస్‌టుడే: పోరూర్ వద్ద కారులో వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నలుగుర్ని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... చెన్నై పోరూం్కి చెందిన 40 ఏళ్ల మహిళ సోమవారం రాత్రి కారులో వెళ్తున్నారు. అప్పుడు పోరూం్ సమీపం అయ్యప్పన్‌తాంగల్‌ వద్ద గుర్తుతెలియని నలుగురు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. తర్వాత డ్రైవం్ని కత్తితో బెదిరించి తరిమారు. మహిళను కారుతోపాటు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. జన సంచారంలేని ప్రాంతంలో సామూహిక అత్యాచారం చేశారు. ఆమె నుంచి ఎనిమిది సవర్ల బంగారు నగలు దోచుకుని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోరూం్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నలుగుర్ని అరెస్టు చేశారు.
భద్రత కల్పించాలి... సైదాపేట, న్యూస్‌టుడే: మహిళలకు భద్రత కల్పించాలని పీఎంకే వ్యవస్థాపకులు రామదాస్‌ ఓ ప్రకటనలో కోరారు. అయ్యప్పన్‌తాంగల్‌ వద్ద మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. ఆ సమయంలో నిందితులు గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని