భావోద్వేగాల్ని మోసుకెళ్లారు..!
చెస్ ఒలింపియాడ్ చరిత్రలో చెన్నై చిరస్థాయిగా నిలిచిపోయింది. మరోవైపు క్రీడాకారుల గుండెల్నీ గెలిచేసింది. టోర్నీ ముగిసినా క్రీడాకారులందరూ ఎంతో భావోద్వేగంతో చెన్నైని మర్చిపోనంతగా వారిని ఆకట్టుకుంది. ఆటగాళ్లలో ఎవరిని కదిపినా.. ‘వీ లవ్ ఇండియా, వీ లవ్ చెన్నై’ అని చెప్పారు. సుమారు 13 రోజులపాటు తామెంతో ఉత్సాహంగా గడిపామని తెలిపారు
అద్భుత జ్ఞాపకాలతో వెనుదిరిగిన చెస్ క్రీడాకారులు
బంగారు పతకంతో గుకేష్
చెస్ ఒలింపియాడ్ చరిత్రలో చెన్నై చిరస్థాయిగా నిలిచిపోయింది. మరోవైపు క్రీడాకారుల గుండెల్నీ గెలిచేసింది. టోర్నీ ముగిసినా క్రీడాకారులందరూ ఎంతో భావోద్వేగంతో చెన్నైని మర్చిపోనంతగా వారిని ఆకట్టుకుంది. ఆటగాళ్లలో ఎవరిని కదిపినా.. ‘వీ లవ్ ఇండియా, వీ లవ్ చెన్నై’ అని చెప్పారు. సుమారు 13 రోజులపాటు తామెంతో ఉత్సాహంగా గడిపామని తెలిపారు.
- ఈనాడు, చెన్నై
టోర్నీలో పదో రౌండ్ ముగిసేటప్పుడు భారత ఆటగాడు గుకేష్ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఏడుస్తూనే హాల్ నుంచి బయటికెళ్లిపోయారు. ఇలా ఎందుకు జరిగిందని అక్కడున్న చాలామంది ఆరా తీశారు. అసలు విషయం ఆ తర్వాత బయటికొచ్చింది. దేశంలోనే తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ జరుగుతున్న తరుణంలో ఇండియాకు స్వర్ణాన్ని సాధించిపెట్టాలని ఇండియా-బి జట్టు కూడా ఆరాటపడింది. కానీ చిన్న తప్పువల్ల ఆట చేజారింది. దీంతో ఆ కల నెరవేరలేదని గుకేష్ తట్టుకోలేకపోయినట్లు జట్టు ఆటగాళ్లు చెప్పారు. తానొక్కడే ఏడ్వలేదని, జట్టుమొత్తం ఏడ్చారని వారంటున్నారు. దీంతో ఫైనల్ రోజు మరింత కసిగా ఆడామని చెబుతారు. గుకేష్ వ్యక్తిగతంగా బంగారుపతకం సాధించినా, జట్టుపరంగా రజతం దక్కింది.
కొత్త స్నేహితులతో క్రీడాకారులు
పెద్దఎత్తున సంబరాలు..
పతకం దక్కడం భారత్కే గర్వకారణమైంది. చెన్నైనుంచి తీపి జ్ఞాపకం తీసుకెళ్తున్నామంటూ భారత ఆటగాళ్లు చివరిరోజు రాత్రి సంబరాలు చేసుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కొందరైతే నృత్యాలు కూడా చేశారు. కోచ్ రమేష్బాబు, ఇతర జట్టు ఆటగాళ్లు చేసిన నృత్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భారత జట్టుకిది మరిచిపోలేని టోర్నీ అని ఆటగాళ్లు కితాబిస్తున్నారు. మరోవైపు ఇదొక చారిత్రక టోర్నీ అంటూ భారత క్రీడాకారిణి తానియా సచ్దేవ్ ముఖ్యమంత్రి స్టాలిన్కు తెలిపారు. క్రీడలపై సీఎం విజన్ ఆదర్శనీయమని వివరించారు.
దిగులుగానే విదేశాలకు..
భారత క్రీడాకారులేకాదు, విదేశీ ఆటగాళ్లు సైతం చెన్నైని వీడేందుకు భావోద్వేగాలకు గురయ్యారు. చాలామంది ఈ విషయాల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘ఇంత భావోద్వేగంతో కూడిన ఒలింపియాడ్ మరేదీ ఉండదు’ అని న్యూయార్క్కు చెందిన గ్రాండ్మాస్టర్ గ్రిగోరియన్ పేర్కొన్నారు. ‘నేను ఇండియాను వదిలి వెళ్లదలచుకోవడం లేదు’ అంటూ సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన దినా బెలంకయ ట్వీట్ చేసింది. ఇలా వందలామంది క్రీడాకారులు చెన్నైని, భారత్ను గుర్తుచేసుకుని ఆన్లైన్లో పోస్ట్ చేశారు. తమకు కొత్త స్నేహితులు కూడా ఈ టోర్నీ ద్వారా పరిచయమయ్యారంటూ యూఎస్కు చెందిన కరిస్సా యిప్ తెలిపారు.
‘ఆహా’రాన్ని మర్చిపోలేం
ఆటే కాదు.. ఇక్కడి ఆతిథ్యం, ఆహారంపై క్రీడాకారులు ప్రశంసలు కురిపించారు. ‘చెస్ చాలా క్లిష్టమైన ఆట, కానీ టోర్నీ నిర్వాహణ మాత్రం అద్భుతంగా ఉంది’ అని దక్షిణాఫ్రికాకు చెందిన క్రీడాకారిణులు తెలిపారు. ఇక్కడ ఆతిథ్యం, ఆహారం సూపర్ అన్నారు. అభిమానులు ఎంతో గొప్పగా ఉన్నారంటూ వివరించారు. మరోవైపు ప్రత్యేకించి వాలంటీర్లకు ధన్యవాదాలు చెప్పాలని, వారికి చెస్మీద ఎంతో జ్ఞానముందని, చాలా స్నేహపూర్వకంగా వ్యవహరించారని లూథియానాకు చెందిన పీటర్ హెయిన్నీల్సన్ తెలిపారు. భారత్ ఇంత గొప్ప టోర్నీకి ఆతిథ్యమివ్వడం చారిత్రక విషయమని, తొలిసారి అన్నికేటగిరీల్లో తొలిస్థానం సంపాదించిన మహిళ సుసన్ పోల్గర్ తెలిపారు.
ఈ అతివలు ప్రత్యేకం
ఒలింపియాడ్లోఅద్భుతం జరిగిందంటూలీడ్ కామెంటేటర్ గ్రాండ్మాస్టర్ జుడిత్ పోల్గర్ తెలిపారు.13మంది మహిళలు ఓపెన్ కేటగిరీలో తలపడ్డారని సంతోషం వ్యక్తంచేశారు. చాలా ప్రతిభ కనబరిచారని, మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీలు మంచి చేస్తే రాజకీయాల్లోకి రాను: నటుడు విశాల్
[ 23-04-2024]
రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే, తనలాంటి వారు ఎల్లప్పుడూ ఓటర్లగానే మిగిలిపోతారని నటుడు విశాల్ తెలిపారు. -
వారి చొరవ స్ఫూర్తిదాయకం
[ 23-04-2024]
గత నాలుగు లోక్సభ ఎన్నికల్లో అత్యంత తక్కువ పోలింగ్ ఈసారి రాష్ట్రంలో నమోదైంది. చాలా స్థానాల్లో 60శాతం పోలింగ్ దాటేందుకూ అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. -
ఓటేయడాన్ని అడ్డుకున్న ఘటనపై దర్యాప్తు
[ 23-04-2024]
కాంచీపురం జిల్లా పరందూర్ సమీపంలో చెన్నై గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం భూసేకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. -
దక్షిణాది నుంచే భాజపాకు పతనం ఆరంభం
[ 23-04-2024]
భారతీయ జనతా పార్టీ (భాజపా)కు దక్షిణాది నుంచే పతనం ప్రారంభమైందని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. -
తగ్గిన ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం
[ 23-04-2024]
మెట్రో రెండో దశలో చేట్పేట్, కీల్పాక్ మెట్రో స్టేషన్ల మధ్య భూగర్భంలో జరుగుతున్న పనులు చేట్పేట్ చెరువు కింద సబర్బన్ స్టేషను ప్రాంతానికి చేరుకున్నాయి. -
20 రోజుల్లో రూ.190 కోట్లు
[ 23-04-2024]
చెన్నై కార్పొరేషన్లో ఏప్రిల్ 20 వరకు రూ.190 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఈ నెలాఖరులోపు చెల్లిస్తే 5శాతం రాయితీ పొందొచ్చని కార్పొరేషన్ ప్రకటించింది. -
త్యాగానికి చిహ్నం కాషాయం
[ 23-04-2024]
కాషాయ రంగు త్యాగానికి చిహ్నమని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. దూరదర్శన్ లోగోను కాషాయ రంగులోకి మార్చడాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించిన నేపథ్యంలో తమిళిసై తన ఎక్స్ పేజీలో స్పందించారు. -
12 జిల్లాల సరిహద్దుల్లో సోదాలు
[ 23-04-2024]
తమిళనాడులో 12 జిల్లాల సరిహద్దుల్లో ఫ్ల్లయింగ్స్క్వాడ్ సోదాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రద సాహు తెలిపారు. -
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో టోకెన్ ఇచ్చి గెలవలేదు
[ 23-04-2024]
ఆర్కేనగర్ ఉప ఎన్నికలో టోకెన్ ఇచ్చి గెలవలేదని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తెలిపారు. తేని జిల్లా కంభంలో జరిగిన గోపాలన్ ఆలయ చిత్తిరై తిరునాళ్లలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. -
మాణిక్కం ఠాగూర్పై అనర్హతవేటు వేయాలన్న పిటిషన్ కొట్టివేత
[ 23-04-2024]
విరుదునగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్పై అనర్హత వేటు వేయాలని కోరిన పిటిషన్ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. -
తండ్రిని చంపిన కుమారుడు
[ 23-04-2024]
తూత్తుక్కుడి సెలసీని కాలనీకి చెందిన సత్యమూర్తి, అనుసూయ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. మద్యానికి బానిసైన సత్యమూర్తి రోజూ భార్యను, పిల్లలను హింసించేవాడు. -
ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు
[ 23-04-2024]
లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి 47 ఏళ్ల జైలు శిక్ష పడింది. శివగంగై జిల్లా కాలైయార్కోవిల్ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా 2014లో మురుగన్ (54) పనిచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్