శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత ధారణ
ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) తమిళనాడు శాఖ, వాసవి క్లబ్ 2 స్టార్ ఎలైట్ చెన్నై సంయుక్త నిర్వహణలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురువారం ఏర్పాటైన సామూహిక నూతన యజ్ఞోపవీత ధారణ శాస్త్రోక్తంగా జరిగింది.
రాజశేఖర్ను సత్కరిస్తున్న నిర్వాహకులు
చెన్నై(సాంస్కృతికం), న్యూస్టుడే: ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (అవోపా) తమిళనాడు శాఖ, వాసవి క్లబ్ 2 స్టార్ ఎలైట్ చెన్నై సంయుక్త నిర్వహణలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా గురువారం ఏర్పాటైన సామూహిక నూతన యజ్ఞోపవీత ధారణ శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానం దీనికి వేదికైంది. దాదాపు 200 మంది గృహస్థులు దేవాలయ మహా మండపంలో కూర్చుని నూతన యజ్ఞోపవీత ధారణ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర పంతులు పర్యవేక్షణలో హోమాలను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయరాజ్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టరు తాడేపల్లి రాజశేఖర్ విచ్చేశారు. ముఖ్య అతిథిని అధ్యక్షులు టీజీ శ్రీనివాసన్ (అవోపా), బీఎస్ శ్రీధర్ (వాసవీక్లబ్) సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకన్యకా పరమేశ్వరి మూలవిరాట్టును స్వర్ణాభరణాలతో, పలు రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించి దర్శనభాగ్యం కల్పించారు. కార్యదర్శి సి.రంగనాథం శెట్టి, కోశాధికారి పి.రాధాకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేలూర్, న్యూస్టుడే: తమిళనాడు విశ్వకర్మ స్నేహితుల సంక్షేమ సంఘం తరఫున వేలూర్ వీర బ్రహ్మంగారి మఠంలో 21 వ వార్షిక అవణి ఆవట్టం కార్యక్రమాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సంఘం సభ్యులు శ్రావణ పౌర్ణమి సందర్భంగా యజ్ఞోపవీతాలను మార్చుకున్నారు. సంఘ అధ్యక్షుడు సీ.తేజోమూర్తి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో గణపతి హోమం నిర్వహించి గాయత్రీ మంత్రం జపిస్తూ యజ్ఞోపవీతాలను మార్చుకొన్నారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి జనార్థనన్, కోఆర్డినేటరు నటేశన్, డిప్యూటీ ప్రెసిడెంటు పన్నీరుసెల్వం, ఆర్గనైజింగు సెక్రటరీ వీ.కుప్పుస్వామి తదితరులు పాల్గొన్నారు.
మైలాపూరులోని కంచి మఠంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గృహస్థులు -చెన్నై, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
[ 25-04-2024]
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. -
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
[ 25-04-2024]
శరీర బరువు తగ్గించుకునేందుకు వెళ్లిన యువకుడు చికిత్స మధ్యలోనే మృతిచెందిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు .. -
మహిళల పాలిట రక్తపోటు
[ 25-04-2024]
అధిక రక్తపోటు, మధుమేహం మహిళలపాలిట శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో సైతం ఈ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా ఈ మరణాలు తమిళనాడుకు సవాలుగా మారుతున్నాయి. -
ఆధారాలున్నా ఓటరు పేర్లు గల్లంతు
[ 25-04-2024]
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల కోసమే మాట్లాడుతున్నారని మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం ఆమె కోవై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. -
బర్డ్ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు
[ 25-04-2024]
తమిళనాడులో బర్డ్ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. -
జూన్లో కొత్త రోడ్లు
[ 25-04-2024]
కొత్త రోడ్ల నిర్మాణానికి చెన్నై మహానగర కార్పొరేషన్ యంత్రాంగం సిద్ధమవుతోంది. జూన్ నాటికి ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని 1,250 రోడ్లలో పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. -
తమిళ అభిమానులకు కృతజ్ఞతలు
[ 25-04-2024]
ధరణి దర్శకత్వంలో విజయ్, త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య తారాగణంగా 2004న విడుదలైన ‘గిల్లి’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష
[ 25-04-2024]
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. -
మత ఘర్షణలు సృష్టించేలా ప్రధాని ప్రచారం
[ 25-04-2024]
మత ఘర్షణలు సృష్టించేలా ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీపై చర్యలు చేపట్టాలని ఎస్డీపీఐ బుధవారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. -
మోదీ పాలనలో మైనారిటీలు ఇబ్బంది పడలేదు: ఓ పన్నీర్సెల్వం
[ 25-04-2024]
మోదీ పాలనలో మైనారిటీ ప్రజలు ఇబ్బంది పడలేదని మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వం తెలిపారు. మదురై తిరుప్పరకుండ్రం సుబ్రమణిస్వామి ఆలయంలో మంగళవారం మురుగన్ను దర్శించుకున్నారు. -
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ చర్యలు: స్టాలిన్
[ 25-04-2024]
రిజర్వేషన్ పెంపునకు ‘ఇండియా’ కూటమి చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళన్ కార్యక్రమానికి శుభాకాంక్షలు చెబుతూ స్టాలిన్ ప్రకటన విడుదల చేశారు. -
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
[ 25-04-2024]
హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఎంకేబీ నగర్లో మంగళవారం ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్